గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జనవరి 2013, బుధవారం

శశి ప్రపంచం చెప్పిన ఆ మంచి విషయమేమిటో తెలుసా?


జైశ్రీరామ్

ఇది శశి ప్రపంచం అనే బ్లాగులో శశికళగారు

మంచి విషయం షేర్ చెయ్యండి

అని ఇలా వ్రాశారు చూడండి.
ఇక దేశం అంతటా ''181'' మహిళా హెల్ప్ లైన్ 
 ఇదీ ఈ రోజు చదివిన న్యూస్.మరి లింక్ ఎక్కడా దొరకలేదు.
విషయం ఏమిటంటే ఇంతకూ ముందు మహిళలకు హెల్ప్ లైన్ 
కోసం కేటాయించిన నంబర్ 167 స్తానం లో ఈ నంబర్ కపిల్ సిబాల్ 
గారు మార్చారు.ఇదైతే ఈజీ గా గుర్తు ఉంటుంది అని.త్వరలో ఈ నంబర్ 
రాష్ట్రాలలోకి అమలు లోకి వస్తుందంట.వీలైనంత మందికి షేర్ చేయండి.
నెట్ లో ఉండేవాళ్లకు అవసరం ఉండదులే అనుకోవద్దు...ఎవరికి ఏ 
అవసరం వస్తుందో ఎవరికి తెలుసు.ఈ నంబర్ ద్వారా కౌన్సిలింగ్ 
చేస్తారా?లేదా పోలీస్ సహాయం ఇస్తారా?కంప్లైంట్స్ తీసుకుంటారా?
తెలీలేదు.ఏమి సహాయాలు ఉంటాయో అందరికి తెలిస్తే బాగుంటుంది.
ముఖ్యంగా పాపం పదునాలుగేళ్ళ లోపు చిన్న పిల్లలకి కూడా...
ఏమంటే వారి మీద జరిగే అకృత్యాలు చెప్పుకోలేక వాళ్ళలోనే వాళ్ళు 
కుమిలిపోతున్నారు.
అసలు కౌన్సిలింగ్ చేసే వాళ్ళ అవసరం యెంత ఉంది అంటె అంత ఉంది.
చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకొనే వాళ్ళు వాళ్ళ బాధ బయటకు చెప్పేస్తే 
ఆ పని చెయ్యరు.ఇంకా ఇలాంటి ఒక హెల్ప్ లైన్ పిల్లలు మిస్ యూస్ చేయకుండా 
కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి.
ఒక సారి ఒక కధో ,నిజంగా జరిగిన సంఘటనో చదివాను.గుర్తుఉన్నంత
వరకు చెపుతాను,కొంత కల్పితం ఉండొచ్చు.కౌన్సిలింగ్ యెంత ధైర్యాన్ని 
ఇస్తుందో చూడండి.
ఒక ఫాంహౌస్.దానిలో ఒక భార్య భర్త .భార్య కు ఉన్నట్లుండి  
నొప్పులు వస్తాయి(బహుశా ఇది మన దేశం లో జరిగి ఉండదు)
భర్త కంగారు పడుతూ హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తాడు.
అప్పుడు అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంది.భర్తను కొన్ని 
ప్రశ్నలు అడిగి ప్రసవం దగ్గర పడింది అని ఆ అమ్మాయికి అర్ధం అవుతుంది.
ఆ అమ్మాయి చెపుతుంది.''మీరు ఏమి కంగారు పడకండి.
నేను ఇప్పుడే మా స్టాఫ్  కి ఇన్ఫాం  చేసాను.
అవును మీకు మొదటి సారి పిల్లలా?''
''అవును '''అని చెపుతాడు భర్త.
''మీరు స్పీకర్ ఆన్ చెయ్యండి''చేస్తాడు.
ఇప్పుడు మీరు ,మీ ఆవిడ మంచి బాబుని మీ ప్రేమకు ప్రతిరూపాన్ని 
చూడపోతున్నారు.యెంత మంచి క్షణాలు.మీ ఆవిడకు కంగ్రాట్స్.
తను చక్కగా మంచి హృదయం తో వాడిని భూమి  మీదకు 
రావాలి అని కోరుకోమనండి.'అంటుంది.
అంత బాధలోనూ ఆ భార్య నవ్వుతుంది.
''మరి మీ భార్య నుదురును ప్రేమగా నిమిరి ధైర్యం చెప్పండి.
ఇదంతా అందరికి మామూలే కదా.ఆమెను సౌకర్యంగా పడుకో పెట్టండి''
అని కొన్ని సూచనలు ఇస్తూ వాళ్లకు ధైర్యం చెపుతూ ఉంటుంది.
''మీరు భయపడాల్సిన పని లేదు మా డ్రైవర్ కి సమాచారం అందింది.
అందరు బయలుదేరుతూ ఉన్నారు.ఒక చక్కని పిల్లవాడిని 
మనం భూమి మీదకు తెస్తున్నాము.మీ అంత అద్రుష్టవంతులు ఇక 
ఎవరూ లేరు''
ఇద్దరు సంతోషపడి ధైర్యం తెచ్చుకుంటారు.
భర్తకు చెపుతుంది కౌన్సిలర్ ''చూడండి భయపడకండి.
ప్రకృతికి మనం అంటె ఎంతో ప్రేమ.మనం అడక్కుండానే మనకు 
కావాల్సినవి అన్ని ఇస్తుంది.ఆమెను కొంచెం ఒర్చుకోమని చెప్పండి.
మీ బాబుని చూసే క్షణాలు వచ్చేసాయి''
''మీ బాబు యెంత అదృష్టవంతుడు.పుట్టగానే ముందు నాన్నను 
చూస్తాడు.ఎవరి పోలికో చూడండి''
ఆమెకు ధైర్యం చెప్పండి మా స్తాఫ్ఫ్ దగ్గరకు వచ్చేసారు.
అవును మీరు సూర్యోదయం చూసారా?యెంత అందంగా ఉంటుంది.
మెల్లిగా సూర్యుడు వస్తూ...వెలుగు రేకలు తెస్తూ ...
మా బాబు కూడా అలాగే వస్తాడు మీ హృదయం లోకి వెలుగు రేకలు తెస్తూ.

మా స్తాఫ్ఫ్ వచ్చేస్తూ ఉన్నారు.మీరు కొంచెం వేడి నీళ్ళు తెచ్చి అక్కడ 
పెట్టండి.అరె బుజ్జి సూర్యుడు వచ్చేసాడా?మెల్లిగా చేతిలోకి తీసుకోండి.
భయపడకండి.ఏమి కాదు.ఇదంతా మామూలే.
మన బాబు ఆరోగ్యంగా మన ముందు ఉండాలి కదా.
వాడు చిరునవ్వుతో తిరుగాడాలి కదా...
ఇలాగా బాబు కి  ఎలా సర్వీస్ చెయ్యాలో చెప్పి వాళ్లకు వేరే 
ఆలోచన లేకుండా చేస్తుంది.వాళ్ళు ధైర్యంగా బాబుని పొందేటట్లు 
భర్త చేత చేయిస్తుంది.అప్పటికి వాళ్ళ స్టాఫ్  అక్కడకు చేరుకొని 
ఫస్ట్ ఎయిడ్ చేస్తారు.
అసలు విషయం ఏమిటంటే అంబులెన్స్ టైర్ పంచర్ అయి వాళ్ళు 
మార్చుకొని వచ్చేసరికి ఇంకా సమయం ఎక్కువ అయింది.
అది కాని చెపితే ఆ భార్య భర్త ఇంకా భయపడి ఉండేవాళ్ళు.
ఆ కౌన్సిలర్ ఇరవయ్యేళ్ళ పెళ్లి కాని అమ్మాయి.అయిన ఏమి 
భయపడకుండా వాళ్ళను భయపెట్టకుండా సరి అయిన దారిలో 
నడిపించింది.భయపడితే ఒక్కో సారి మనం చేయగలిగిన పనులు 
కూడా చెయ్యలేము.
ఈ ''181'' లో ఇలాటి మంచి కౌన్సిలర్స్ ఉంటె ఎన్నో ప్రాణాలు 
నిలబడతాయి.
ప్రభుత్వాలు  ప్రజల కోసం ఎప్పుడో ''నిర్భయ''లాంటి వాళ్ళ బలిదానం 
తరువాత కాకుండా, ఎప్పుడూ ఇలాటి మంచి పనులు చేయాలి 
అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
చూచారు కదండి? ఇదీ విషయం.
శుభమస్తు.
జైహింద్
Print this post

3 comments:

శశి కళ చెప్పారు...

ఓహ్.చింతా గారు మీరు ఆ రోజు అవధానం లో అప్రస్తుతం చేసిన వారేనా?మీ పద్యాలు నాకు భలే నచ్చాయి

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఔనమ్మా శశికళా! ఆ రోజు అవధానంలో అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకుఁడను నేనేనమ్మా. నా ఆశుపద్యాలు నచ్చినందుకు చాలా సంతోషమమ్మా. శుభమస్తు.

శశి కళ చెప్పారు...

మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.