గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, మే 2026, బుధవారం

ఇచ్ఛావాక్య సంఘట్టన కందం..... సమర్పణ శ్రీ వైద్యంవేంకటేశ్వరాచార్యులు.

 జైశ్రీరామ్.

               ఇచ్ఛావాక్య సంఘట్టన కందం


   కవిశరభ పెదమందడి వేంకటకృష్ణకవి (క్రీ.శ1888- 1943) దోమకొండ సంస్థానాస్థానకవి. ఈ కవివర్యుడు

తెలంగాణాలోని గద్వాలాది సంస్థానాలన్నిటిలోను సము

చితంగా సత్కరింపబడినాడు. వీరు అనేక రచనలు చేశారు.

వాటిలో  నిర్వచనమహాభక్తవిజయం గొప్పరచన,నాలుగు

సంపుటాల గ్రంథం. అందులో మొదటి సంపుటం సురవరం

రంగారెడ్డిగారి(ప్రతాపరెడ్డిగారి చిన్నాన్న)ఆర్థిక సహకారంతో

ప్రచురితం.సురవరంరంగారెడ్డిగారిని గురించి వేంకటకృష్ణకవి

ఇచ్ఛావాక్యసంఘట్టనకందం రచించారు. ఆపద్యం-


క. కుసుమ శర రిపు వరద రం

    గ సురంజితగాన మీరె కావుడి నను ని

    త్య సుమన వినుత ప్రచురా

    యసమనుత విహిత గుణ మురహరయదువీరా!


పై పద్యాన్ని  కిందివలె నిలువుగ మూడు పంక్తులలో ఇలా

రాయాలి-


కు రి పు గ సు న మీ న ను న  వి  రా య వి హి ర  హ  రా

సు ర వ రంరం గా  రె  డి ని  మ ను చు  స  త తముర   వీ 

మ శ ర  ద జి  త  కా వు త్యసు  త ప్ర   మ ను గుణయ దు


పై పంక్తులను నిడివిగా క్రమంగ పైనుండికిందికీ,కిందినుండి

పైకీ చదివితే కందపద్యం ఉంటుంది.

పై  మూడు అడ్డం పంక్తులలో మధ్యపంక్తిని వరుసగా చదివితే

సంఘట్టన ఇచ్ఛావాక్యం ఉంటుంది. ఆ వాక్యం-

 సురవరం రంగారెడ్డిని మనుచు సతతము రవీ!


ఈ వివరాలు మా ఆత్మీయమిత్రులు డా.శ్రీరంగాచార్య,రిటైర్డ్

ప్రిన్సపాల్ గారు నా దగ్గర గ్రహించి తెలుగువిశ్వవిద్యాలయం

వారు2005లోప్రచురించిన చాటుపద్యరత్నావళిలో చేర్చారు

        ‌                  🙏🙏🙏

                             సమర్పణ

                     వైద్యంవేంకటేశ్వరాచార్యులు

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.