జైశ్రీరామ్.
ఆర్యులారా! మన కృదయములలో నెలకొనియున్న ఆ జగన్మాత ఔదవరోజగు నేడు స్కందమాతగా మనలను దీవింపవచ్చియున్నది. మనకందరికీ ఆ అమ్మ దీవనలు లభించుగాక.
ఓం స్కందమాత్రే నమః
శ్లో. సింహాసనగతా నిత్యం - పద్మాశ్రిత కరద్వయా
శుభమస్తు సదా దేవి - స్కందమాతా యశస్వినీ.
తే.గీ. నిత్య సింహాసనాధిష్ఠ! నిరుపమాన!
పద్మసమలంకృతకరా! ప్రపన్న రక్ష!
నీకు శుభమగు నిత్యమున్ నిర్వికార!
స్కందమాతా!యశశ్వినీ! సదయఁ గనుమ.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.