గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఫిబ్రవరి 2013, బుధవారం

మంత్రోపాసన – నాదోపాసన. శ్రీ భాస్కరానంద నాథ వివరణ.

జైశ్రీరామ్.
ఆర్యులారా!  మంత్రోపాసన – నాదోపాసన అనే విషయమును శ్రీ భాస్కరానంద నాథులవారు వివరించిన విషయం మనం తెలుసుకొందాం.
మంత్రోపాసన – నాదోపాసన
శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నాదం ఎక్కడి నుంచి ఉత్పన్నమౌతుంది? మంత్రానికి మూలం ఏమిటి?
మంత్రానికి మూలం బీజం, ఆ బీజానికి మూలం నాదం, ఆ నాదానికి మూలం బిందువు.  అన్నింటికీ మూలం బిందువు.
బిందువు లో నుంచే సృష్టి అంతా జరిగినది. బిందువు వికసనం వలన ఇది అంతా జరిగినది అని మనకు తెలుసు. బిందువు ఎందుకు వికసనం జరిగినది? దాని లోపలి శక్తి తాడనము చేత. కాబట్టి బిందువు లోపలే శక్తి వున్నది. దీనిని బట్టి మనకు అర్ధమయ్యేది ఏమిటంటే బిందువు పరమాత్మ, దానిలోపలి శక్తి ప్రకృతి.
అయ్య, అమ్మ ఇద్దరూ ఒక్కటే. ఒకరి లోపల ఒకరు వున్నారు. శక్తి లేనిదే అయ్య కదలడానికి అశక్తుడు అని మనకు తెలుసు. ఇదే మాటను శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పి వున్నారు.
ఇప్పడు మనము తెలుసు కోవలసినది అసలు ఈ శక్తి ఎవరు? ఏమిటి? ఎక్కడి నుంచి వస్తుంది? అని.
ఝుమ్మంది నాదం .. అని మనకు తెలుసు. నాదం లో నుంచి ఝు౦ అనే శబ్దం వస్తుంది. ఏమిటి ఈ  ఝు౦ అనే నాదం అని పరిశీలిస్తే ఇదే శక్తి. బిందువు లో నుంచి ఝు౦ అనే నాదం వస్తుంది, అదే శక్తి. అదే అమ్మ. అదే భ్రమరాంభిక. అదే ఆది శక్తి.  శబ్దం లో నుంచి నిశ్శబ్దం, దానిలో నుంచి శబ్దం. నిశ్శబ్దం లో నుంచి శబ్దం ఎలా?  అదే ఝు౦ అనే నాదం.
ఈం, ఈమ్ , అమ్ , మ్.  వీటిల్ని పరిశీలించండి.    “మ్” ... అనేది శక్తి. అదే ఉమా.
అదే మూల ప్రకృతి.
నాదంలో నుంచి వచ్చేది అదే ... “మ్”.
హార్మోనియం పెట్టెలో నుంచి వచ్చేది అదే ధ్వని. వీణ మీటితే అదే ధ్వని, నాద స్వరములో అదే ధ్వని,
గంట లో నుంచి వచ్చేది అదే ... “మ్”.
ఇతర గ్రహాలలో విన వచ్చేది అదే. నిశ్శబ్దం లో నుంచి వచ్చేది అదే. చంద్ర మండలములో ““మ్”. అనే ధ్వని వినిపిస్తుందని చెప్పారు శాస్త్రజ్ఞులు. విద్యుచ్చక్తి లో అదే ధ్వని. శక్తి ఎక్కడ వుందో అక్కడ అదే ధ్వని.
High Induction transformer / HT voltage లో అదే ధ్వని. ......  “మ్”.
ల౦, హం, య౦, రం, వం, సం, గం... లో నుంచి వచ్చేది అదే శబ్దం ......  “మ్”.
శ్రీరాముని తారక మంత్రమైన బీజాక్షరం “రాం, రామ్” లో నుంచి అదే శబ్దం ......  “మ్”.
రామం, విష్ణుం, శివం, కేశవం, దామోదరం ..... లో నుంచి అదే శబ్దం ......  “మ్”.
విష్ణు సహస్ర నామం లోని “విష్ణుం” అదే.
హ్రీం లోని “ఈ” కారము అదే. ... “మ్”.
అదే శ్రీమాత.
హిరణ్య వర్ణాం హరిణీం ,........... హిరణ్మయీం... అదే శబ్దం ......  “మ్”.
ఏ మంత్ర మైనా అదే "ఈమ్" అనే శబ్దం రావాలి. అదే ప్రాణ శక్తి, అదే జీవ శక్తి. అదే చలనము. మంత్రానికి మూల శక్తి అదే.
అదే ఆదిశక్తి.   "ఈం" అనేది మూల ప్రకృతి, అదే నాదం.
ఓం కారములోని జీవ శక్తి అదే. "మ్.
దానిని మీద ధ్యాస వుంచండి, సమాధి లోకి వెళ్లి పోతారు. మనము చేయవలసిన సాధన అదే. అందరం కలిసి చేద్దాము.
ఝు౦ కారం వినడమే. శ్రీశైలం లో వినబడేది అదే. కైవల్యం అదే. అదే కైవల్యం. అదే కైవల్యం. నిశ్శబ్దం లోకి వెళ్ళగలిగిన వాడు ఈ శబ్దం వినగలడు ,             అది వినగలిగిన వాడు ధన్యుడు.
అదే సమాధి స్థితి. దానిలో లీనం అయిపోవడమే.
శ్రీ భాస్కరానంద నాథ వివరణ. చూచారు కదా! మరొక పర్యాయం మరొక మంచి విషయాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
జైహింద్.
Print this post

1 comments:

తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ. చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణారావు గారికి నమస్సులు. శ్రీ భాస్కరానందుల వారి మంత్రోపాసన నాదోపాసన్ చదివిన తరువాత సమస్తామునకు మూలము పూర్ణమే. పూర్ణమునుండి పుట్టి పూర్ణములో లయమవడమే. దాని శబ్దస్వరూపమే బిందువు. దాని నాదరూపమే ఓం. కనుకనే పోతనామాత్యులు బిందువును చాల ఎక్కువగా తన పద్యాల్లో వాడినారేమోనని అనిపిస్తున్నది. వారి ప్రార్థనా పద్యాన్ని అవలోకించండి. శ్రీ భాస్కరానందుల వారు చెప్పినట్లు కైవల్యాన్నే కోరినాడు పోతన.(నోటికి వచ్చిన దానిని అక్షరరూపంచేసాను.అక్షరదోషములున్న విజ్ఞులు సరిదిద్ద మనవి)


శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు భక్త పాలనకళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నా
నాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.