గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, నవంబర్ 2009, మంగళవారం

చెప్పుకోండి చూద్దాం 18.

పాఠకావతంసులారా!
పొడుపు కథలకున్న ప్రత్యేకత మన తెలుగుకే సొంతం. ఇది చాలా యదార్థం.
అంతటి అసాధారణమైన ఈ పొడుపు కథలకు సంబంధించిన సాహిత్యాన్ని తెలుసుకోవడంలో మనం ముందంజే ఉంటున్నామనడానికి నేనొసగే అన్ని పొడుపు కథలకు పాఠకులనుండి వస్తున్న స్పందనే నిదర్శనం.
ఇప్పుడు మరొక చిన్న పద్యాన్ని మీ ముందుంచుతున్నాను.

క:-
చెట్టుకు నాల్గక్షరములు
తొట్ట తొలుత యక్షరంబు త్రోసిన త్రాడౌ.
చెట్టెయ్యది? త్రాడెట్లగు?
పట్టుగ తెలుపుడయమీరు ప్రస్ఫుటమవ్వన్.

చూచారు కదా! ఇక ఆలసింపక సమాధానం తెలియ పరచడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారుగా! ఐతే వెంటనే వేగుద్వరా పంపండి.

జైహింద్.
Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

మందారం కదా

అజ్ఞాత చెప్పారు...

మందారం కదా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.