గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, నవంబర్ 2009, శనివారం

దీర్ఘాయుష్మతీ భవ.

శ్రీ కల్యాణ గుణ ప్రపూర్ణ అయిన మన భరత మాత కన్న ముద్దు బిడ్డ, ఆంధ్రుల గర్వ హేతువు అయిన గాన కోకిల శ్రీమతి పి.సుశీలమ్మ డబ్బది ఐదవ జన్మదిన మహోత్సవము పేరుతో అనేక మంది గాయనీ గాయకులు మనను తమ గాన మాధుర్యంతో సంతోషపెట్టారు. గాంధర్వ కళా ప్రపూర్ణులందరూ వందనీయులు.
ఈ సందర్భంగా కళారాధకులందరికీ నా అభినందనలు.

కొందరు పెద్దలు ఆ యమను దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించినట్టుగా గమనించాను.
ఈ సందర్భంగా నాదో సందేహం.
పెద్దలు మనలను దీవించేటప్పుడు స్ర్తీలకూ, పురుషులకూ ఒకే విధంగా పద ప్రయోగం (భాషా) దోషం కానేరదా?

పురుషులకు దీర్ఘాయుష్మాన్ భవ అని అనడం పుంలింగాన్ని సూచిస్తుంది.
మరి స్త్రీల విషయంలో అంత శ్రద్ధ చూపకపోవడం ఆలోచించ వలసిన విషయం.

స్త్రీలకు దీర్ఘాయుష్మతీ భవ అని దీవించడం సముచితమేమో అనిపిస్తోంది.
నా అభిప్రాయం తప్పైతే సరిచేయండి.
లేదా సముచితమైన ప్రయోగం సూచించండి.

సుశీలమ్మ నిండు నూరేళ్ళూ తన గాన మాధుర్యంతో గాన ప్రియు లందరినీ పరవశింపఁ చేస్తూ ఆయురారోగ్య మహదైశ్వర్యాలతో భారతావని గర్వ కారణంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.

జైహింద్.
Print this post

1 comments:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

గురువుగారూ,తెలుగు భాష విషయంలో మీకన్నా తెలిసిన వారెవరున్నారండి!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.