గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, సెప్టెంబర్ 2009, సోమవారం

దత్తపది పూరణ. విషయం: రాజశేఖరుని చరమ యాత్ర.

సుజనులారా!

శ్రీ కంది శంకరయ్య గారిచ్చిన సమస్యాపూరణలను నేను చేసినవి చూచిన జయభారత్ గారు తమ అమూల్యమైన అభిప్రాయాన్ని వ్రాస్తూ దత్త పదిని పూరించమని వారి సరదా తీత్చమని వ్రాశారు . నేను పూరించే ప్రయత్నం చేశాను. మూరూ పరిశీలించండి.

మా సంభాషణ యిలా సాగింది. చూడండి.

jaiabhaarat గారిలాగన్నారు.

నమస్కారం రామకృష్ణ రావు గారు
పూరణ చాలా బాగుంది

నా సరదా కూడా కొంచెం తీర్చండి
ఈ కింది పదాల తో పద్యం కావాలి

ఒక్కొక్క లైన్ లో ఈ పదాలతో

రాజశేఖరుడు
హెలికాప్టర్ [లేక]లోహ విహంగం
నల్లమల అడవులు
పావురాల గుట్ట

regards
jayabharath

September 20, 2009 6:59 PM



ఆర్యా! మీ సంతోషం వ్యక్తం చేసినందుకు ధన్యవదములు.
మీరిచ్చినది దత్త పది . విషయం చెప్పలేదు. ఐనా మిమ్మల్ని నిరాశ పరచ కుండా పూరించుతున్నాను చూడండి.

విషయం:- రాజ శేఖరును చరమ యాత్ర.
సీ:-
రాజశేఖరుడు విరాజ మానముగను - రచ్చబండకు నేగె. రహిని వెడల
లోహవిహంగము సాహసంబున నేగ - మేఘమడ్డుగ వచ్చె మింటిపైన.
నల్లమలడవులు తెల్లబోవుచు చూచె. - పావురాయిల గుట్ట భయము నొందె.
కాల వాహిని వాని కబళింపగాఁ బూనె. - యేమి చెప్పగనగు నీశ్వరేచ్చ
గీ:-
గాలిలో నేగు యంత్రము నేలఁ గూలె.
జాడఁ గానుట కైనను సాధ్య పడని
భీకరంబైన యడవితో నేకమ్మయ్యె.
శేఖరుండేగె దివికిని చిత్రముగను.


చూచారుకదండి. మీ అభిప్రాయాలను, వాటితో పాటు పూరణకై యివ్వ దలచుకుంటే సమస్యలను కాని, దత్త పదిని కాని, వర్ణనలను కాని, ఛందో భాషణను కాని, వ్రాసి పంపండి. ఆ శారదాంబ నాచే పూరింపఁ జేస్తుందేమో చూద్దాము.ఆన్నట్టు చెప్పడం మరిచాను. ఏ తేదీ ఏ వారమౌతుందో మీరడిగితే నేను సమాధానమిచ్చే ప్రయత్నం కూడా చేయగలనని మనవి.

జైహింద్.


Print this post

1 comments:

bharath చెప్పారు...

థాంక్స్ రామకృష్ణ రావు గారు
చాలా చక్క గా ఉంది పద్యం
ధన్యవాదములు
జయభారత్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.