గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, మార్చి 2009, శుక్రవారం

ఈ పద్యంలో ఎన్ని పద్యాలున్నాయో తెలుసుకొని చెప్పండి చూద్దాం.

tensionసుహృజ్జనులారా!
క్రిందిది పద్యమో - ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.

సువినయంబొప్పఁ జూచువారలకు సద్ విజ్ఞానిగా దోచుచున్ రహించు
సుగుణ సంపన్నుగ శోభిలున్ పరమత క్రోధంబు లేదేలకో? యనంగ.
సుమనసుంబెద్దయెసుమ్మ! యంచు బొగడన్ మర్యాదయే రూపమౌననంగ
సుజనులే మెచ్చగ చోద్యమొప్ప మెలగున్. చైదంబులం దౌష్ట్యముల్ దలిర్ప.
సురుచిర సుహాసనంబుల ధరణి పయిన
తానె గొప్ప ధన్యాత్ముడుగానిరతము.
మెలుపున దురితము లరసి మెలగు కరటి
నరయ నగునే? భువి {పై} పయి ని భరము కాదె?
జైహింద్.
callme Print this post

1 comments:

రాఘవ చెప్పారు...

మత్తేభ-గర్భ-సీసము, కంద-గర్భ-తేటగీతి (ఎత్తుగీతి). అంతేనాండీ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.