జైశ్రీరామ్.
శ్లో:-
విద్వత్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన.
స్వదేశే పూజ్యతే రాజా. విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
గీ:-
పాండితీ రాచరికములుభవ్యమిలను.
సాటి లేనివి. వాటికి సాటి అవియె.
రాజు తన రాజ్యమందునె రాణఁ గాంచ
పండితుండెల్ల చోటుల పడయు కీర్తి..
భావము:-
పాండిత్యము, రాజరికము సాటిలేనివి. రాజు స్వదేశములో పూజింపఁబడు చుండగా విద్వాంసుఁడు ఎక్కడైననూ పూజింపఁ బడును.
జైహింద్.
1 comments:
నిజమే , రాజులు , రాజ్యాలు , ఆయా దేశము లందు మాత్రమె ,కీర్తిని పొందుతారు. చరిత్ర పరంగా చదివితే తప్ప గుర్తు ఉండవు .కానీ కవులు , పండితులూ , వీరి రచనలు , ప్రబంధ కావ్యాలు , యుగ యుగాలుగా గుర్తు చేస్తూనే ఉంటాయి . ఇది మేలిమి బంగారమే మరి . ధన్య వాదములు .
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.