గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జులై 2015, శుక్రవారం

గోదావరి పుష్కరాలు సందర్భముగా ఆచరణీయాంశాలు.

జైశ్రీరామ్
ఆర్యులారా!
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు పుష్కరాల సందర్బంగా సంకల్పవిధానాన్ని అందించారు. 
శాస్త్రోక్తమైన ఈసంకల్పవిధానంతో పుష్కరస్నానం చేసి, స్నానఫలితాన్ని పొంద వచ్చును. 
ముందుగా కొంచెం మట్టి లేక ఇసుక చేతిలోకి తీసుకొని నదివద్దకు చేరి ఈక్రింది శ్లోకాలను చదువుతూ ఆమట్టిని కానీ ఇసుకని కానీ నదిలో కలపవలెను.
1. పిప్పలాద మహాభాగ సర్వలోకశుభంకర
మృత్పిండం చ మాయా దత్తం ఆహారార్ధం ప్రకల్ప్యతామ్
2. పిప్పలాదాత్ నముత్పన్నే కృతే లోకే భయంకరే
మృత్తికాం తే మయా దత్తం ఆహారార్ధం ప్రకల్ప్యతామ్
ఆపై నదీ జలాన్ని మూడుసార్లు శిరస్సుపై "పుండరీకాక్ష , పుండరీకాక్ష , పుండరీకాక్ష" అనుచు చల్లుకోవలెను.
ఆచమనం 
ఓం కేశవాయ స్వాహా,
ఓం నారాయణాయ స్వాహా,
ఓం మాధవాయ స్వాహా ( ఆచమనం చేయునప్పుడు చేతిలో నీళ్ళు పోసుకొని మూడుసార్లు శబ్దం లేకుండా త్రాగాలి )
ఓం గోవిందాయ నమః,
ఓం వామనాయ నమః,
ఓం శ్రీధరాయ నమః,
ఓం హృషీకేశాయ నమః,
ఓం పద్మనాభాయ నమః,
ఓం దామోదరాయ నమః,
ఓం సంకర్షణాయ నమః,
ఓం వాసుదేవాయ నమః,
ఓం ప్రద్యుమ్నాయ నమః,
ఓం అనిరుద్దాయ నమః,
ఓం పురుషోత్తమాయ నమః,
ఓం అధోజాక్షయ నమః,
ఓం నారసింహాయ నమః,
ఓం అచ్యుతాయ నమః,
ఓం జనార్దానాయ నమః,
ఓం ఉపేంద్రాయ నమః,
ఓం హరయే నమః,
ఓం శ్రీకృష్ణాయ నమః,
ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమిభారకా:
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.
ప్రాణాయామం
ఓం భూ:,
ఓం భువ:,
ఓం సువ:,
ఓం మహా:,
ఓం జన:,
ఓం తప:,
ఓం సత్యం,
ఓంతత్సవితుర్ వరేణం, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఓం మాపో జ్యోతీ రసో అమృతం బ్రహ్మ భూర్భువ స్సువ రోమ్.
సంకల్పం 
ఓం ఓం ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం,
శ్రీమహావిష్ట్నో: ఆజ్ఞయా , ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్దే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూ ద్వీపే, భరత వర్షే భరతఖండే, మేరో: దక్షణదిగ్భాగే, (.... నది పేరు చదవాలి ), సమస్తబ్రాహ్మణదేవతాహరిహరసన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ..... నామసంవత్సరే ...... ఆయనే ...... ఋతౌ ...... మాసే ....... పక్షౌ ...... తిధౌ ........ వాసరే, శుభనక్షత్ర, శ్రీమాన్ ......గోత్రః, ...... నామదేయః,....... శ్రీమతః...... గోత్రస్య ..... నామదేయస్య ........
( స్త్రీలు ఈక్రింది విధముగా చెప్పవలయును )
శ్రీమతి ....... గోత్రవతీ ........ నామధేయవతి , శ్రీమాత్యః ....... గోత్రవత్యః ...... నామధేయవత్యః
మమ సకుటుంబస్య, సపుత్రకస్య, ఆయుష్యాభివృద్ధ్యర్ధం,
ఇతోధిక మహాదైస్వర్యప్రాప్త్యర్దం,
సుగుణానేకసుపుత్రప్రాప్త్యర్దం,
గృహ, పశు, శిశు, వృద్ధ సర్వజనవహితదుష్టగ్రహ నివారణార్ధం,
భూమ్యంతరిక్షదివ్యమహోత్పాతాది దుర్నిమిత్తాద్భుతదర్శన దుష్టారిష్టప్రయోగోపద్రవ సకల క్షుద్ర ప్రయోగ, శల్యతంత్రాది ప్రయోగ, బగళా ప్రయోగ, ఆసురీ ప్రయోగ, వార్తళీ ప్రయోగ నివారణార్థమ్,
బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చండాలది నానాజాతి స్త్రీ పురుష దుష్ట గ్రహోచ్చాటనార్ధం, త్రయోదశ సన్నిపాత, అష్టాదశ కుష్ట గుల్మ, అష్టవిధ మహాపక్షపాత, పాండురోగ, కామిలాక్షయ, హృదయశూల, అక్షిశూల, కుక్షిశూలది సమస్తవ్యాధి నివారణార్థమ్,
సకలదేవతా, పితృదేవతా, ముని, ఋషి, యోగి, జన సంప్రీత్యర్ధం పుష్కరస్నానం కరిష్యే.
(ఈ విధముగా పలికి మూడుమార్లు నదిలో మునిగి, అనంతరం రెండుచేతులతో నదీజలాలను తీసుకొని 18 మార్లు తర్పణములుగ తిరిగి ఆనదిలోనే వదలవలెను)
తర్పణం
1) ఓం సంధ్యాం తర్పయామి 
2) ఓం గాయత్రీం తర్పయామి
3) ఓం బ్రాహ్మీం 
4)ఓం నిమృజీం తర్పయామి
5) ఓం ఆదిత్యం తర్పయామి
6) ఓం సోమం తర్పయామి
7) ఓం అంగారకం తర్పయామి 
8) ఓం బుధం తర్పయామి
9) ఓం బృహస్పతిం తర్పయామి
10) ఓం శుక్రం తర్పయామి
11) ఓం శనిం తర్పయామి
12) ఓం రాహుం తర్పయామి
13) ఓం కేతుం తర్పయామి
14) ఓం యమం తర్పయామి
15) ఓం సర్వదేవతాన్ తర్పయామి
16) ఓం సకలపితృదేవతాన్ తర్పయామి
17) ఓం సర్వఋషీన్ తర్పయామి 
18) ఓం సర్వభూతాని తర్పయామి.
పుష్కరములలో విధిగా చేయవలసిన కార్యక్రమములు
పుష్కరములలో 
పితృదేవతలకు తర్పణాదులు, 
పిండప్రదానాదులు తప్పక చేయవలెను. 
12రోజులు స్నానం చేయువారు రోజునకు ఒక్కొక్క వస్తువుచోప్పున దానము చేయుట మంచిది. యమస్మృతిలో ఈవిధానం చెప్పబడినది. 
12 రోజు కాకుండా ఒక్కరోజు మాత్రమే స్నానం చేయువారు ఈ12దానాలను వారికి సాధ్యమైనది దానము చేసుకోవచ్చును. దానము అనేది శక్తినిబట్టి చేయవలెను. ఏ పుష్కరములో అయినా
1 వరోజు - కూరగాయలతో పాటుగా బియ్యం
2 వరోజు - సువర్ణం
3 వరోజు - వెండి
4 వరోజు - గోధుమలు
5 వరోజు - పెసలు
6 వరోజు - వస్త్రములు
7 వరోజు - కంచము, పళ్ళెము వంటి భోజన పాత్రలు ( వీటినే భజనములు అంటారు )
8 వరోజు - నువ్వులు
9 వరోజు - ఆసనములు అనగా పీటలు, మంచము, కుర్చీలు మొదలగునవి
10 వరోజు - గోవు
11 వరోజు - నెయ్యి
12 వరోజు - దీపము
ఇవికాక శాస్త్రసహితములైన దానములను కూడా ఆచరించవచ్చును.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పుష్కరాలను గురించి సంకల్ప సహితముగా చక్కగా వివరించారు చాలా బాగుంది .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.