గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, నవంబర్ 2014, ఆదివారం

తత్క్లిష్టం యద్విద్వాన్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. తత్క్లిష్టం యద్విద్వాన్
విద్యాపాఙ్గతోऽపి యత్నేన
విజ్ఞాతారం అవిన్దన్
భవతి సమః ప్రాకృతజనేన. 
గీ. ప్రజల గుర్తింపు లేనట్టి పండితులిల
బ్రతుకవలయును సామాన్య ప్రజల వోలె.
కుందనపుపళ్ళెమునకైన గోడ చేర్పు
తప్పదిలలోన యను సూక్తి తలప నిజము.
భావము. ఎంతో శ్రమపడి సకల విద్యలలోను పండితుఁడైన విద్వాంసుఁడైనా సరే తనను గుర్తించేవారు లేక అందరిలోను సామాన్యులతో బాటుగానే సామాన్యజీవనం గడుపుతూ ఉండవలసినదే. బంగారు పళ్ళేమునకైనా గోడ చేర్పు కావాలంటారు.అదే ఇది.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.