గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, నవంబర్ 2014, శుక్రవారం

హాస్య బ్రహ్మ శ్రీమాన్ శంకర్నారాయణ గారిచే హాస్యావధాన కార్యక్రమం.

జైశ్రీరామ్.
ఆర్యులారా! పశ్చిమ కోనసీమ ప్రాంతమైన తణుకు పట్టణంలో శ్రీ నన్నయ భట్టారక పీఠం వారి నిర్వహణలో హాస్యబ్రహ్మ బిరుదాంకితులైన శ్రీ శంకర నారాయణ గారిచే హాస్యావధాన కార్యక్రమము 30-11-2014 న సాయంత్రం 6 గంటలకు జరుగుచున్నది.అవకాశమున్నవారంతా తప్పక ఈ కార్యక్రమాన్ని చూచి మహదానందభరితులగుదురనుటలో ఏమాత్రం విప్రతిపత్తి లేదు. ఇది శ్రీమాన్ సుశర్మగారి ఆధ్వర్యవమున అత్యద్భుతముగా జరుగనున్నది. అవకాశం కల్పించుకొని వెళ్ళగలిగేవారందరినీ మనసారా ఆహ్వానిస్తున్నారు. తప్పక మీరూ వెళ్ళే అవకాశం ఉంటే మాత్రం మానవద్దు. తప్పక వెళ్ళగలరు. 
నాకు ఎడమప్రక్కనున్నవారే శ్రీ శంకర నారాయణ గారు.
కార్యక్రమనిర్వాహకులు శ్రీ సుశర్మగారు.
అవధానరాజధానిలో నిషిద్ధాక్షరి పృచ్ఛకులుగా శ్రీ సుశర్మ.
నమస్తే.
జైహింద్.
Print this post

1 comments:

కంది శంకరయ్య చెప్పారు...

నమస్కారం!
ఈ ఆహ్వానపత్రికను ‘శంకరాభరణం’ బ్లాగులో ప్రకటించాను.
ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.