గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, నవంబర్ 2014, శనివారం

అవధాన రాజధానిలో నిర్వహించిన నృత్యపది తిలకించండి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధానిలో  నిర్వహించిన నృత్యపది తిలకించండి.
ఈ నృత్యము చేయుచున్న చిరంజీవి కేవలం మూడు పదుల వయసువాడే కాని నాలుగు పదుల దేశాలలో మన నాట్యశాస్త్ర ప్రాచుర్యాన్ని పెంచ్ పంచిన భరత మాత ముద్దుబిడ్డ. మన తెలుగు యువకుడే. ఇతనికి సుమారు 27 బిరుదులు అనేక దేశాలవారు ఇచ్చారు. ఇతను పూర్తి చేసిన డాక్టరేట్లు 7 ఉన్నాయి ఇప్పటికి. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు అయిన దీక్షితు గారి శిష్యుఁడే ఇతడు. వీని నృత్యాన్ని ఆకళింపు చేసుకొని, వెన్వెంటనే మన అవధాని శ్రీమాన్ నాగఫణి శర్మ గారు ఆశువుగా గీతం పాడి వినిపించి ప్రేక్షకాళిని సమ్మోహితులను చేశారు.
మీరూ విని చూచి, ఆనందాన్ని అనుభవించుదురనే సద్భావనతో మీముందుంచినాను.
  ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వారే నిజమైన జ్ఞానులనేది నిజం గురుపాదములదగ్గరే కూర్చొని ప్రణమిల్లుతున్న ఈ శిష్యుఁడే పైన నృత్యపదిలో నాట్యం ప్రదర్శించిన మన నాట్యాచార్యుడు..
అవధానిగారిచేత సపత్నీకముగా సత్కృతుడైన మన నాట్యబ్రహ్మ.
భారతాంబ ముద్దుబిడ్డతో నేను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.