గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, సెప్టెంబర్ 2014, బుధవారం

మృత్పిండ ఏకో బహుభాండ రూప ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. మృత్పిండ ఏకో బహుభాండ రూప
స్సువర్ణ మేకం బహుభూషణాని,
గోక్షీర మేకం బహు ధేనుజాత 
మేకః పరాత్మా బహుదేహవర్తీ॥ 

గీ. మలయు కుండలన్నిట నుండు మట్టి యొకటె. 
స్వర్ణ భూషణంబుల నుండు స్వర్ణమొకటె. 
ధేనువులు వేరు పాలొకటేను తెలియ. 
దేహములు వేరు, మసలెడి దేహి యొకడె.
భావము. కుండలకు చాలారూపాలు. దానికి మూలప్రకృతి అయిన మట్టిముద్ద ఒక్కటే, ఒక్కటే అయిన బంగారమే నానావిధాలైన ఆభరణరూపాల్లో దర్శింపబడేది. తెల్లావు, నల్లావు, కపిలగోవు ఇలా ఎన్నివున్నా (ధయ త్యేనాం వత్సీ ఇతి ధేనుః) వీటి అమ్మతనానికి కారణమైన పాలు ఒక్కటిగానే వున్నయి. అదే విధంగా హరిహరబ్రహ్మేన్ద్రాదులు, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, దత్తాది నానారూపాలల్లో వున్న దేవతల దైవత్వానికి మూలమైన ఆ పరమాత్మ ఒక్కడే. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.