గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

అపృష్టోஉపి హితం బృయాత్... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్
శ్లో. అపృష్టో పి హితం బృయాత్, యస్య నేచ్చేత్ పరాభవం,


ఏష ఏవ సతాం ధర్మో, విపరీత మతొన్యథా.
క. ఇతరుల మంచిన కోరిన,
సతతము హితమును తెలుపుచు చక్కగ నడుపున్
క్షితిపై సద్గుణ గణ్యులు. 
మతిమంతుల మార్గ మిదియె, మహితంబిదియే.
భావము. ఎవరికి పరాభవము జరగకూడదని కోరుకుంటావో, వానికి హితమును అడుగక పోయినను చెప్పాలి . ఇదియే సత్పురుషుల ధర్మం. అడుగలేదు కదాని హితమును చెప్పక ఊరకుండిన అది అధర్మము.
వివరణం: శ్రీమద్రామాయణం లో విభీషణుడు అన్నగారైన రావణునికి ఇదే విధంగా ధర్మం చెప్పాడు. వాడు మృత్యువునే ఆశ్రయించాడు. రావణుడు మృత్యువునకు యెదురువెల్తున్నట్టి వాడు, అట్టి వాడు మృత్యురూపుడే కావున వాడు విడిచిపెట్టదగినవాడు. కావున విభీషణుడు అమృత స్వరూపుడైన రాముణ్ణి ఆశ్రయించాడు. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.