జైశ్రీరామ్.
శ్లో.ప్రియః ప్రజానాం దాతైవ న పునర్ద్రవిణేశ్వరఃఅగచ్ఛన్ కాంక్ష్యతే లోకై ర్వారిదో న తు వారిధిః.
క. ప్రజలకు దాతయె ప్రియమిల,
నిజధన సంవర్ధి కాడు. నేర్పున కురిసే
సుజలములు కలుగు మేఘమె
ప్రజలకు హితమౌను, జలధిఁ వలవరు ప్రీతిన్.
భావము. ప్రజలకు ధనవంతునికంటే దాతయే ప్రియమైనవాడు. ఈ లోకంలో అందరూ నీటినిచ్చే మేఘాన్నే కోరుకుంటారు గానీ నీటికి నిధియైన సముద్రుని కాదు.
జైహింద్.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.