గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఆగస్టు 2013, మంగళవారం

నేడు రవీంద్ర భారతిలో అష్టావధానము. అవధాని శ్రీ మద్దూరి రామ మూర్తి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆంధ్ర భాషాగీర్వాణికి అవధానార్చన రవీంద్ర భారతిలో జరుగుతోంది. రెండవ తేదీ నుండి జరుగుతున్న అవధాన సప్తాహంలో భాగంగా
నేడు సాయంత్రం 5న్నర గంటలనుండి
శ్రీ మద్దూరి రామ మూర్తి అవధానిగారి అష్టావధానం ఉంది. ఆ కార్యక్రమమున వ్యస్తాక్షరి పృచ్ఛకుఁడుగా నేను వ్యవహరిస్తున్నట్లు తెలియజేయుటకు ఆనందంగా ఉంది.
రేపు శ్రీ వర్దిపర్తి పద్మాకర్ గారి అష్టావధానం జరుపబడుచుండగా
ఎల్లుండి శ్రీ గరికపాటి వారి అష్టావధానం జరుపబడుతోంది.
ఈ కార్యక్రమములను చూచే భాగ్యం మనకు కలుగచేసిన శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు మరియు నిర్వాహక గణము ఎంతటి మహద్భాగ్యులో కదా! వారందరికీ ఆంధ్రామృతం ద్వారా అభినందన పూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన పీఠము నలంక రించిన అవధాన సరస్వతులకు పాదాభి వందనములు
అందు వ్యక్తా క్షరీ పృచ్చకులుగా శ్రీ చింతా రామకృష్ణా రావుగారికి హృదయ పూర్వక అభినందన మందారములు . దేవి కటాక్ష వీక్షణములకు అదృష్ట వంతులైన పాండితీ స్రష్ట లందరికీ ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.