గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, అక్టోబర్ 2008, సోమవారం

ఆంద్ర పద్య కవితా సదస్సు. విశాఖ జిల్లా విభాగము

ఆంధ్ర పద్య కవితా సదస్సు విశాఖ జిల్లా మాసే మాసే కవన విజయం
ప్రతీ ఆంగ్ల మాసం ౨వ ఆది వారం జరుపుకొనే కార్యక్రమంలో భాగంగా నిన్న అనకాపల్లిలో విజయా రెసిడెన్సీలో కవి పండిత గోష్టి జరిగింది. జిల్లా అధ్యక్షులు శ్రీ కే. కోటారావుసభాధ్యక్షులు కాగా డాక్టర్ మిడుసుమిల్లి వెంకటేశ్వరరావు కవుల స్వీయ కవితా గానం నిర్వహించారు.దీపావళి అనే అంశం మీద కవులు వారి వారి కవితలు వినిపించారు.శ్రీ యుతులు బద్ది నాగేశ్వర రావు, భమిడిపాటి ప్రసాద రావు, యివటూరి పార్వతీశం, శ్రీమతి గాయత్రి, డాక్టర్ యల్లెస్వైవి శర్మ, డాక్టర్ రామ చంద్ర రావు,వర లోచన శ్రీరామ మూర్తి, చింతా రామ కృష్ణా రావు, మున్నగు వారి స్వీయ కవితా గానాలతో దీపావళి సాక్షాత్కరించింది.
ఈ కార్యక్రమం రిటైర్డ్ యింజనీర్ శ్రీ జి.యస్.ఆర్. శేషగిరి రావుగారి ఆర్ధిక సహాయంతో నిర్వహంపబడింది. ఒక ముఖ్య విషయం యేమిటంటే కవి వతంస బిరుదాంకితులు శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి " " కవి సామ్రాట్ విశ్వనాధ - భావుకత " " అనే అంశంపై అమృత ప్రవాహం లాగా సాగిన ప్రసంగం.
కిష్కింధా కాండలో సీతాన్వేషణ చేయుచున్నాడు రాముడు.అక్కడ పంపా తీరాన గల ప్రకృతి సౌందర్యం వర్ణనలో విస్వనాధుని ప్రత్ర్యేకతను చాటే పద్యాలలో కవిప్రయోగించిన ఛందస్సులలో కనబరిచిన ఔచిత్యం, దళ సార్ధక్యం, వర్ణనలో అంతర్ లీనమై సాగుతున్న కథకు సంబంధించిన యదార్థ వృత్తాంతం, ధ్వని గాంభీర్యం, మున్నగు అంశాలు సోదాహరణంగా వివరించారు. విశనాధవారే ఆ వుపన్యాసం వింటే నిజంగా తాను ప్రయత్న పూర్వకంగా అంతటి అర్థ గాంభీర్యాని వుంచానా! అని ఆశ్చర్యపోయి వుండేవారు. ఆ వుపన్యాసం అంత బాగుంది.
అవకాశం కుదిరినప్పుడు తప్పకుండా ఆఉపన్యాసాన్ని సోదాహరణంగా మీకందించగలను.
నమస్తే.




....

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.