గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, సెప్టెంబర్ 2008, బుధవారం

వినాయక వర్ణన చేయండి.

సర స్వతీ నమస్తుభ్యం.
సరస్వతీ మూర్తులు, పుంభావ సరస్వతీ మూర్తులు పెక్కురున్నారు. ఆంద్ర భాషామతల్లి సేవలోపునీతులవుతున్నారు.
వారిని చుసి మనం ఉప్పంగిపోతాం. మనకీ అనిపిస్తుంది వారిలాగా మాతాదాలనీ, వారిలాగా పద్యాలు వ్రాయాలని. .
" సాధనమున పనులు సమకూరు ధరలోన " అన్న వేమన పలుకు మనకి తెలియంది కాదు.ఐతే ప్రయత్నం చేయకుండా ఏదీ సాధ్యం కాదు. మనమూ ప్రయత్నిద్దాం.
ముందుగా కొన్ని అనుసరణీయాంశాలు. :-మనకి గద్యనయినా పద్యాన్నయినా అర్థస్ఫురణ కలిగేటట్టు చదువ గలగాలి.
ఆతరువాత సాధ్యమయినన్ని ఎక్కువ పద్యాలు చదవాలి. ఏ ఛందస్సులో వ్రాయాలనుకుంటే ఆ ఛందస్సులో గల పద్యాలు చదివినట్లయితే ఆ ఛందస్సులో సులభంగా వ్రాయవచ్చు. ప్రయత్నించి చూడండి.
నేటి మీ ప్రయత్నానికి నాన్డి పలుకుతారా ! ఐతే వినాయక నవరాత్రులు సందర్భంగా మనం వినాయకుని వర్ణిస్తూ మీకు వచ్చిన ఛందంలో వ్రాసి పోస్టు చేయండి.. ఎదురుచూడనామరి?
నేటి విషయం వినాయక వర్ణన నిర్విఘ్నమస్తు.
చింతా రామ కృష్ణా రావు. . Print this post

1 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ గణనాయక ప్రార్థన:-
ఉ:-అంబకు ముద్దు బిడ్డడవు.అంకము జేర్చి సుఖింపజేయు నా
సాంబుడు నిన్ను, తమ్ముడగు షణ్ముఖుడున్ నిను గొల్చు నిత్యమున్.
సంబర మొప్ప నిన్ గనును సమ్మతి శ్రీ హరి మేనమామ . సౌ
ఖ్యంబుగ నుంటివీవు. మము గావగ నీకు నుపేక్ష యేలనో ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.