గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, సెప్టెంబర్ 2008, గురువారం

శ్రీ గురుభ్యో నమః

ఉపాధ్యాయ ప్రపంచానికి వందనాలు. ఆదర్శ ఉపాధ్యాయ వర్గానికి అభినందనలు. ఈ వృత్తి చేపత్తడం నిజంగాపూర్వ జన్మ సుకృత విశేష ఫలం. నిజమైన ఉపాధ్యాయుడు కలి యుగం లో కృతయుగం సృష్తించగలడు. కృతయుగం లో కలి యుగాన్ని సృష్తించ గలవాళ్ళూ సమాజం లో మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక్క మాటలో గలది గురుస్థానం. చెప్పాలంటే సృష్తిని శాసించగల వాదు ఒక్క ఉపాధ్యాయుడే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సాక్షాత్తు ఆ శ్రీ కృష్ణ పరమాత్మే సాందీపుడనే గురువుని ఆశ్రయించి విద్యార్దిగా చేరి చదువుకొన్నాడు కదా. అంతటి వైశిష్యం
ఏ వృత్తినైనా చేపట్టిన వ్యక్తి తద్ద్వారా పొందే ప్రతిఫలాన్ని దృష్తిలో పెట్టుకోకుండా చేపట్టిన వృత్తికి అంకిత భావంతో పని చేచేయాలి. ఒక కాపలా కాసే వ్యక్తే వున్నాడనుకొందాం. జీతంతో ముడీ పెట్టకుండా అహర్నిశలూ తాను కాపలా కాసే సంస్తను కంటికి రెప్పలా కాపలా కాస్తాడు.. అతడే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఆ స్సంస్థకు రక్షణ లేకుండా పోతుంది.అతని వల్ల ఆ సంస్త మాత్రమే నాశనమౌతుంది. కాని ఒక ఉపాధ్యాయుని నిర్లక్ష్యం ఎన్ని తరాలమీద ప్రభావం చూపుతుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది.
అందరి పల్లల తల్లిదండ్రులూ ఉపాధ్యాయులమీద ఎనలేని నమ్మకంతో వారి పిల్లల్ని ఉపాధ్యాయుల కప్పగిస్తారు. అట్టి విద్యార్థులు ఉపాధ్యాయులకడ గదిపే ప్రతీక్షణం ఎంతోవిలువైంది.బాధ్యతా యుతంగా మెలిగేఅతని రుణం తీర్చుకోలేనిది. బాధ్యతారహితుడికి ఏ శిక్షైనా తక్కువె.
సద్గురువు రుణం తీర్చుకోగలిగేదికాదు. లసత్ గురువులకు, జ్ఞాన విలసత్గురువులకు పాదాభివందనం చేస్తుందీసమాజం. నమస్తే. Print this post

2 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ గురుభ్యో నమః అనునది టెక్నికల్ ప్రోబ్లం వల్ల తప్పుగా వడినది. గుర్తించగలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

tE:-చిలమ కూరింట వెలసిన చిత్ స్వరూప!
విజయ మోహన ! మీ వ్యాఖ విజయ పథము.
పద్య కవులింక వెలయరే ప్రతిభ జూప.
హృద్య సంవేద్య.మై నిల్చు పద్య విద్య.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.