గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మే 2019, శుక్రవారం

విజేతలైన ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక అభినందనలు.

జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.

నిన్నన్ వెల్వడెనెన్నికల్ ఫలితముల్. నేర్పున్ ప్రదర్శించి రే
మన్నన్ భారత పౌరు లద్భుతముగా, నానందమందన్ న.మో.
నెన్నెన్ జాతి. శుభంబు దేశమునకున్. హృద్యంబు నీ దృష్టి. శ్రీ
మన్నారాయణ! శాంతిఁ గొల్పి, ప్రజలం బాలించగా చేయుమా.

విజేతలైన ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక అభినందనలు.
ప్రజలు మిమ్ములను నమ్మి గెలిపించారు. త్రికరణశుద్ధిగా నీతిమార్గంలో ప్రజా సంక్షేమానికే మీ పాలన సాగినంతకాలం కొనసాగించండి. ప్రజల హృదయాలలో శాశ్వితంగా నిలిచిపొండి.
ఆ పరమాత్మ మీకు అన్నివిధముల తప్పక సహకరించునుగాక.

🏼జైశ్రీమన్నారాయణ🏼

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

namskaaramulu
amdarikee abhinamdanalu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.