గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఫిబ్రవరి 2016, బుధవారం

రాజా రాష్ట్ర కృతం పాపం . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. రాజా రాష్ట్ర కృతం పాపం!  -  రాజపాపం పురోహితః!
భర్తా చ స్త్రీకృతం పాపం!   -  శిష్యపాపం గురుర్వ్రజేత్!! (భోజచరితమ్)
గీ. ప్రజల పాపంబు రాజుకు ప్రాప్తమగును.
రాజు పాపంబు గురువుకు ప్రాప్తమగును.
స్త్రీల పాపంబు భర్తలఁ జేరుచుండు
శిష్య పాపంబు గురువులఁ జేరు నిజము.
భావము. రాష్ట్రములోని ప్రజలు చేయు పాపములు రాజును పొందును; రాజు గావించు పాపములు పురోహితుని పొందును, స్త్రీలు చేయు పాపములను భర్తలకు సంక్రమించును. శిష్యుల పాపములు గురువునకు సంక్రమించును. అనగా రాజు ప్రజలను,పురోహితుడు రాజును,భర్త భార్యను, గురువు శిష్యులను, మంచిమార్గమున నడచుకొనునట్లు చూడవలసిన బాధ్యత గలవారని భావము.  
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును ఎవరు మంచిమార్గము నందు లేకున్నను దోషము బాధ్యత గలిగిన మరియొకరికి లభించును .మంచి శ్లోకము .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.