గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2015, సోమవారం

ఉదారగుణ సంపన్న రాజమహేంద్ర వర పుత్రిక " ప్రజా పత్రిక " వారపత్రిక.

జైశ్రీరామ్.
ఆర్యులారా!  సమాజం దృష్టిలో అతి సామాన్యమైన ఒక వార పత్రిక - ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిపుణులైన ఉపాధ్యాయులను గుర్తించి, వారిలో ఉన్న నిపుణతను సభాముఖంగా ప్రశంసిస్తూ, వారిని అత్యద్భుతంగా సత్కరించడం ద్వారా వారి సేవాపటిమను ద్విగుణీకృతం చేస్తూ సమాజంలోనే అసాధారణ మహోన్నతవిధానంతో సామాజికులను ఆశ్చర్యానికి లోను చేస్తోందంటే ..... అది సామాన్యమైన విషయం కాదు. 
ఈ క్రింది చిత్రాలను, 
ఆ పత్రిక ఎడిటర్ దేవీ సుదర్శన్. వ్రాసిన లేఖను, మీరు గమనించండి. 
ఆ పత్రిక తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరము నుండి సుమారు వందేళ్ళుగా వెలువడుతున్న 
" ప్రజాపత్రిక " వారపత్రిక.

సర్  /  మేడం,    
ఈ రొజు దర్మంచర కమ్యూనితి   హాల్లో టీచర్స్ డే చేశాం. సుదర్సన్ అధ్యక్షతన జరిగిన యీ  కర్యక్రమంలొ డా.కూర్మయ్య, పిల్లి డేవిడ్ కుమార్, మహీధర రామ శాస్త్రి, మాణిక్ రెడ్డి  సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.నెల్లూర్ లో ఏనుగు పై సన్మానం పొందిన షేక్ మస్తాన్  సాహెబ్  గారు ఈ సభలో చక్కటి ఉపన్యాసం ఇచ్చారు.`15 మంది తీచర్స్ కి సన్మానం జరిగింది. పి.వి.ఎస్ క్రిష్ణా రావ్,  ఎలిజిబెత్ రని ఫణి నాగేశ్వర రావ్, దెవీ సుదర్సన్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు 
ఎడిటర్ 
దేవీ సుదర్శన్.
చూచారు కదా! ఇది ఎంతటి శ్రమ దమాదులతో కూడుకొన్నకార్యక్రమమో!
ఆదాయ వ్యయాలను పరిగణించకుండా ఎదుటి మనిషిలో మంచి అన్నది ఉన్నదంటే, దానిని గుర్తించి, అది వారి దృష్టికి తీసుకు వచ్చి ఆ మంచిని శతధా సహస్రధా ద్విగుణీకృతం చేయడం ద్వారా ఆ వ్యక్తిని సమాజానికి పరిపూర్ణంగా ఉపయోగపడేవానిగా మార్చుతున్న మహత్తర కార్యక్రమం ఇది.
ఇటువంటి పత్రికలు ఎంతగా ప్రోత్సహింపఁబడితే సమాజానికి అంతగా మేలు చేకూరుతుంది.
ఇట్టి మహత్తర కార్యక్రమాలను ఆదర్శప్రాయంగా చేపట్టి నిర్విఘ్నంగా అత్యద్భుతంగా నిర్వహిస్తున్న " ప్రజా పత్రిక " అధిపతులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియఁజేస్తున్నాను.
సన్మానితులందరినీ నేను మనసారా అబినందిస్తున్నాను.
ఐతే
ఈ సన్మానితులు తమలో పత్రిక ఏవైతే సుగుణాలను గుర్తించి సన్మానం చేసిందో ఆ సుగుణాలను మరింత పెంచుకొని, తమకు చేసిన సన్మానం యోగ్యమయినదే అని సమాజంలో అనిపించుకొనేలాగున తమ భవిష్యత్ కార్యక్రమావళిని తీర్చి దిద్దుకోవలసి, ఆవిధంగా తమ సేవలను సమాజానికి అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఎంతమంది తాము సత్కరింపఁబడటంలో గల ఔచిత్యాన్ని ఋజువు చేసుకుంటారో.
జైహింద్.
Print this post

3 comments:

prajapatrika చెప్పారు...

baavundi sir, mee abhimaanaaniki dhanyavadaalu.~Sudarsan, editor, Praja Patrika, Rjy celL: 98480 96374

prajapatrika చెప్పారు...

bbavundi sir, mee abhimaananiki krutajnatalu
~Sudarsan,edior,praja patrika Rajy cell: 9848096374

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రజా పత్రిక నిత్యనూతనంగా వర్ధిల్లు గాక

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.