జైశ్రీరామ్.
శ్లో. న హింస్యాత్ సర్వభూతాని - మైత్రాయణచరో భవేత్ |
నేదం జీవితమాసాధ్య - వైరం కుర్వీత కేనచిత్ || (మహాభారతం)
తే.గీ. ప్రాణులనుహింసచేయుట పాపమగును,
జీవులకు స్నేహమందించు జీవితమున,
మనుజ జన్మంబు మహితము, మాను హింస,
మానవునిగ నీధర్మంబు మానవలదు.
భావము. ఏ ప్రాణిని కూడా హింసించకూడదు. ప్రతి జీవితో స్నేహభావంతో
వ్యవహరించాలి. ఈ మానవ జన్మ లభించిన తర్వాత ఎవరి పట్ల కూడా
శత్రుత్వాన్ని సాధించకూడదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.