గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మే 2025, మంగళవారం

అనకాపల్లి జిల్లా దిమిలి గ్రామంలో శ్రీభాగవతులసోమన్నా జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో ఆనాటి 1974-75 SSC విద్యార్థులు నిర్వహించిన స్వర్ణోత్సవం

 జైశ్రీరామ్.

అనకాపల్లి జిల్లా దిమిలి గ్రామంలో శ్రీభాగవతులసోమన్నా జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో 01-3-1974న నేను ప్రథమ ఆంధ్రపండితునిగా ఉద్యోగమున చేరియుంటిని. ఆనాటి 1974-75 SSC విద్యార్థులు ఇప్పటికి 50 సంవత్సరములు పూర్తయిన సందద్భముగా స్వర్ణోత్సవమును జరిపి ఆనాటి వారి గురువులమైన మమ్ములను ఘనంగా సన్మానించి వారి సంస్కారమును బహిర్గతం చేసి మిగిలిన విద్యాసంవత్సరములలోని విద్యర్థులకు మార్గదర్శకులయ్యారు. అట్టి యీ సంస్కారవంతులైన మా విద్యార్థులను ఆ జగన్మాత నిరంతరము కాపాడుచుండుగాక.👍

జైహింద్.

Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.