గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 81 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

చంజనకుని నుండి పొందిన బ్రశస్త నితంబ ఘనంబుఁ జేసి ధా

రణమును చేయఁగల్గుటగు ప్రాభవమొప్పధరన్, నితంబ

ద్ధన మరణంబుగాగ, సుకృతంబయె నీకది, భూ ధరంబునన్,  

మనమున నిన్నునెన్ను నను మానిని నెమ్మిని మున్నునమ్ముమా. 81

భావము

తల్లీ ! శైలజా! నీ జనకుడు హిమవంతుడు తన నితంబ ( కొండ నడుమ పైనున్న చదునైన ) ప్రదేశం నుంచి గొప్పబరువును , వైశాల్యాన్ని గ్రహించి నీకు అరణముగా ( వివాహసమయంలో తండ్రి కుమార్తెకు ఇచ్చే కానుక) ఇచ్చాడు. కాబట్టే నీ పెరుగుదల ఘనత బరువై, విశాలమై, భూమండలాన్నంతా కప్పుతూ తనబరువుచే భూమిని తేలికైన దాన్నిగా చేస్తున్నది.దీన్లో సందేహం లేదు.
జైహి<ద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.