గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 45 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

చంసురుచిరహాసమై విరియు, సుందర దంతపు కాంతి కేసరో

త్కర వర సౌరభాన్వితపు గణ్యపు నీ ముఖపద్మమందునన్

స్మరుని యడంచినట్టి శివ సన్నుతదృక్భ్రమరమ్మువ్రాలెగా,

వరలెడి నీలి ముంగురులు పద్మపు కాంతిని గేలి సేయుగా.  45

భావము.
జగన్మాతా ! చిరు నవ్వుతో వికసింౘుౘున్నదియు దంతముల కాంతులు అనే కేసరములచే సుందర మైనదియు, సువాసన కలదియు అయిన నీముఖ పద్మము నందు, మన్మథుని దహించిన శివుని చూపులు అనే తుమ్మెదలు కూడా మోహ పడుతున్నాయి.

సహజంగా నే వంకరలు తిరిగిన వై, కొదమ తుమ్మెదల కాంతివంటి నల్లని కాంతి ని కల్గి యున్న ముంగురులతో కూడిన నీముఖము, పద్మ కాంతిని (అందాన్ని) పరిహసిస్తూన్నది.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.