పాఠకా! సులభంగా కనిపించే ప్రశ్నలు కూడా ప్రశ్నలే. తప్పించుకొనే యత్నం చెయ్యక సమాధానం చెప్పండి.
క:-
ఎద్దీశున కశ్వంబగు?
గ్రద్దన నేదడవితిరుగు ఖర కంటకియై?
హద్దుగ నేవాడు ఘనుడు?
పద్దుగ నుత్తరములిందె పడయంగానౌన్.
ప్రశ్న1: ఏ+అది=ఎద్ది = ఏది, ఈశునకు = ఈశ్వరునకు, అశ్వంబు + అగు = వాహనమై ఉంది ?
------- ఈశ్వరుని వాహన మేది?
ప్రశ్న2: గ్రద్దన = శీఘ్రముగా, ఏది + అడవి లో = అడవిలో ఏది, ఖర కంటకియై = ముండ్లతో, తిరుగు = తిరుగుతుంది ?
---------అడవిలో ముండ్లతోతిరిగే జంతువేది ?
ప్రశ్న3: హద్దుగ = నిర్దిష్టముగా, ఏ + వాడు = ఏవాడు = ఎటువంటివాడు , ఘనుడు = గొప్పవాడు ?
---------నిర్దిష్టముగా ఎటువంటి వాడు గొప్పవాడు ?
సమాధానం టపాలో ఉంచుతారు కదూ?
ఆఁ. ఒక్క విషయం మరువకండీ--- సమాధానాలు పై పద్యంలోనుండే గ్రహించి వ్రాయాలండోయ్.
ఇక పంపండి.
జైహింద్.

రాసింది
Labels:










