గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 59 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

చంసురుచిరమైన నీ ముఖము, సుందర గండ యుగంబు గొప్పగా

మెరియుచు నీదు కమ్మల భ్రమింపగఁ జేసెడుఁ జక్రభాస  సు

న్దర మరు తేరిఁ బోల, శశి  ధత్ర సుచక్ర ధరా రథాన సుం

దరహరుఁడెక్కియుండ హరినందనుఁడేచుచుఁబ్రేమఁ గొల్పెనే. 59

భావము.

అమ్మా ! విశాలమైన నీ చెక్కిళ్ళ పై , నీ చెవి తమ్మెల జత ప్రతిఫలిస్తోంది. అందువల్ల నీ చెవితమ్మల జంట ,వాటిరెండుప్రతిబింబాలూకలసిమొత్తంనాలుగుచక్రములుకాగా,నీముఖమునాలుగుచక్రములుగలమన్మథుడు ఎక్కిన రథము వలె నాకు తోస్తున్నది. నాలుగు చక్రముల రథాన్ని ఎక్కి మన్మథుడు మహా వీరుడై _ సూర్యుడు , చంద్రుడు అనే రెండు చక్రాలు మాత్రమే కల , భూమి అనే రథాన్ని త్రిపుర సంహార సమయంలో యుద్దానికి సిద్ధం చేసికొన్న ప్రమథాధిపతియైన శివుడికి ద్రోహం తలపెట్టాలనీ, శివుడి తోనే పోరాడాలనీపన్నాగంచేస్తున్నాడు.(అనగాశివుడికికూడామోహంకల్పించటానికిప్రయత్నించాడు.అందుకుసుందరమైనదేవిముఖంఅతనికితోడ్పడినది.)

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.