గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 4 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

కైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సీనీకంటెనన్యులౌ నిఖిలదేవతలెన్న నభయముద్రను గల్గి యలరుదురిల,

శ్రీద! వరాభయచిహ్నముల్ ప్రకటితముద్రల నభినయము గల తల్లి

వీవేను ముఖ్యమౌ యీశ్వరీ! సృష్టిలో కారణమొకటుండె కనగ నిజము,

కోరకముందేను కోరికలను దీర్చి నీ పాదముల్ భీతినే దహించు,

తే.గీఅట్టి నీ పాదములు నేను పట్టనుంటి,

శరణు కోరుచు, మాయమ్మ! శరణమిమ్మ.

రామకృష్ణుని కవితలో ప్రాణమగుచు

వెలుఁగు మాయమ్మ! నిన్ను నే విడువనమ్మ! 4

భావము.

అమ్మా! లోకములకు దిక్కు అయిన తల్లీ! మిగిలిన దేవతలు అందరూ అభయ ముద్రలను కలిగి ఉన్నారు.  అందరు దేవతలకు ముఖ్యమయిన నీవు మాత్రము వరాభయ గుర్తులు అయిన ప్రకటిత ముద్రల అభినయము కల దానవు. అయితే కోరక ముందే నీ పాదములు కోరికలు తీర్చి, భయములు పోగొట్టును కదా

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.