గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి -3 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

ఓం శ్రీమాత్రే నమః.
సీ.  అజ్ఞాన తిమిరాననలమటించెడివారి కమిత! సూర్యోదయమయిన పురివి,
మందబుద్ధులకును మహిత చైతన్యమన్ మంచి పూవులనొల్కు మధువువీవు,
దారిద్ర్యముననున్న వారిని కరుణించు చింతామణులహార కాంతివీవు,
సంసార సాగర సంలగ్నులకు నిలన్ ధరణిఁ గాచిన కిరిదంష్ట్రవీవు.
తే.గీ.  శంకరుని యాత్మలో వెల్గు శశివి నీవు,
రామకృష్ణుని కవితాభిరామమీవు,
పాఠకులచిత్తముల నిల్చు ప్రతిభవీవు,
నిన్ను సేవించువారిలోనున్నదీవు.॥ 3 ॥

భావము.
అమ్మా !నీ చరణ పద్మ రేణువు అజ్ఞానము అను చీకటితో ఉన్న వానికి సూర్యోదయము జరుగు పట్టణము వంటిది, మంద బుద్ధులకు చైతన్యము అను పుష్పముల నుండి వెలువడిన మధుర ధార వంటిది,  దరిద్రముతో ఉన్న వానికి చింతామణుల హారము వంటిదియు, సంసార సముద్రమున మునిగిన వానికి వరాహావతారము అగు విష్ణు మూర్తి యొక్క కోర వంటిది కదా !
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.