గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 1 || శ్రీమతి రత్నాదేవి. .. పద్యానువారము. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

తే.గీధరణిఁ బడ్డ పాదములకు ధరణియేను

చూడనాధారమమ్మరో! శోభనాంగి!

నీదు సృష్టిలో దోషులన్ నీవె కాచి

శరణమొసగంగవలెనమ్మ! శరణు శరణు.

భావము.

భూమిపై పడిన పాదములకు భూమియే ఆధారము. అటులనే నీ సృష్టిలో ఉన్న దోషులను నీవే కాపాడి శరణమొసగవలెనమ్మా! నీవే నాకు శరణు.

శాఅమ్మా! నీ వర శక్తిఁ గల్గుటనె చేయంగల్గు నీ సృష్టి తా

నెమ్మిన్, గల్గని నాడహో, కదలగానే లేడుగా సాంబుఁ డో

యమ్మాశంభుఁడు, బ్రహ్మయున్, హరియు నిన్నర్చించ  వెల్గొందు ని

న్నిమ్మేనన్ దగ నెట్లు గొల్చెదరిలన్ హీనంపుపుణ్యుల్, సతీ!. 1

భావము.

అమ్మా! శివుడు శక్తితో (నీతో) కూడినప్పుడు జగన్నిర్మాణము 

చేయగలుగుతున్నాడు. కానిచో స్పందించుటకు కూడా అసమర్థుడు కదా

బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల చేత ఆరాధించబడు నీకు, పుణ్యసంపదలేనివాడు 

నమస్కరించుట, స్తుతించుట ఎలా చేయగలడు ?

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.