జైశ్రీరామ్
శ్లో. గుణవంతః క్లిశ్యంతే ప్రాయేణ - భవంతి నిర్గుణాస్సుఖినః |
బంధనమాయాంతి శుకాః*ల్ - యథేష్ట సంచారిణః కాకాః ||
తే.గీ. బాధలను గుణవంతులే పడుదురిలను,
సుఖములను దుష్టు జనులందుచుందురు రకట!
పంజరంబులన్ జిలుకలు బంధనమగు,
వాయసములాకసముననే వరలుఁ గనుమ.
భావము. లోకమున గుణవంతులగు జనులే తరచుగా బాధలను
అనుభవించుచున్నారు. గుణహీనులు సుఖమును అనుభవించుచున్నారు.
చిలుకలు పంజరమున బంధింపబడుచున్నవి. కాకులు స్వేచ్ఛగా ఆకాశమున
విహరించుచున్నవి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.