జైశ్రీరామ్.
శ్లో. పఠకాః పాఠకశ్చైవ - యే చాన్యే శాస్త్ర చింతకాః |
సర్వే వ్యసనినో మూర్ఖాః - యః క్రియావాన్ స పండితః || (మహాభారతం)
తే.గీ. పఠక పాఠకుల్, శాస్త్ర సంభాషకులును
తద్వ్యసనముచే మూర్ఖులు, దాని నొడిసి
పట్టి పాటింపకున్నచో, భవ్యగతిని
యాచరింపంగ వలయు తా మరసినయవి.
భావము. చదివేవారు, చదివించేవారు, మరియు శాస్త్ర విషయాలను చర్చించే
ఇతరులు, వీరందరూ కేవలం గ్రంథాల వ్యసనంలోనే మునిగిపోయి ఉంటే,
వారు మూర్ఖులే. శాస్త్రోక్త ప్రకారం క్రియాశీలుడైనవాడే నిజమైన పండితుడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.