గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, మే 2025, శుక్రవారం

పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానంబు చిత్రంబుగన్... నా పూరణము.

 జైశ్రీరామ్.

వంచత్వంబున కూనలన్ దినుటకై పంచాస్యమేతెంచగా

నెంచెన్ దానికి చిక్కకుండునటులన్ హృద్యంపు ధైర్యంబుతో

వంచించెన్ వెనుకంజనుండి కరచెన్ పర్వెత్తె నాసింహమే 

*పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానంబు చిత్రంబుగన్.*

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.