జైశ్రీరామ్.
శ్లో. కర్మణా జాయతే భక్తిః - భక్త్యా జ్ఞానం ప్రజాయతే।
జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః - ఇతి శాస్త్రార్థసఙ్గ్రహః॥
తే.గీ. భక్తి కర్మచే కలుగును భక్తి వలన
జ్ఞానముత్పన్నమయెడు నా జ్ఞానమునను
ముక్తి సాధ్యమౌ మనలకు, పూజ్యులార!
శాస్త్రమర్మంబు నెఱుఁగుడీ చక్కగాను.
భావము. కర్మలవల్ల భక్తి కలుగుచున్నది. భక్తి వల్ల జ్ఞానమున్నూ,
తద్వారా మోక్షము కలుగుతున్నదని శాస్త్ర నిర్ణయము.
జైహింద్.
Print this post
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.