జైశ్రీరామ్.
శ్లో. మూర్ఖాణాం పండితా ద్వేష్యా - దరిద్రాణాం మహాధనాః |
అధార్మికాణాం ధర్మిష్ఠా - విరూపాణాం సురూపిణః || (మహాభారతం)
తే.గీ. మూర్ఖులకు పండితులు రిపుల్ భూమిపైన,
బీదలకు రిపుల్ ధనుకులు, పృథ్విపైన
ధర్మ దూరులకును రిపుల్ ధర్మపరులు,
రూపవంతులు రిపులు కురూపులకును.
భావము. మూర్ఖులకు పండితులు శత్రువులు. బీదవాళ్లకు ధనికులు
శత్రువులు. పాపులకు ధార్మికులు శత్రువులు. కురూపులకు సురూపులు శత్రువులు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.