గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మే 2025, సోమవారం

శ్రీ చేపూరి శ్రీరాములు అవధాని ౨౮వ అష్టావధానము...దీప్తిశ్రీనగర్లో..ంఇయాపూర్ మిత్రమండలి ఆధ్వర్యవములో...తె. 25 - 5 - 2025.

 

జైశ్రీరామ్.

శా.  శ్రీమన్మంగళ సద్వధాన చతురుల్,   శ్రీమంత సత్ పండితుల్,

ధీమంతుల్, వర కావ్యకర్తలు, మహ ద్ధీమూర్తు లీ సత్ సభన్

శ్రీమంతంబగు సద్వధానమున యీ చేపూరి యుప్పొంగగా

నీమంబొప్పగ వచ్చినారు. తమకు నే చేసెదన్ సన్నతుల్.

శా.  శ్రీమన్మంగళ శ్రీనివాసుని దయన్ చేపూరి శ్రీరాం గుణో

ద్ధాముండద్భుత సద్వధాన మున మోదంబొప్ప సత్పూరణల్

ధీమంతుల్ గని మెచ్చ జెప్పుత, శుభాధిక్యంబు చేకూర్చుతన్,

శ్రీమాతన్ మదినిల్పి సాగుడు సుధీ! సిద్ధింప మీ కోరికల్.

జైహింద్.



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.