జైశ్రీరామ్.
శ్లో. అగ్రతః చతురో వేదా: - పృష్ఠతః సశరం ధనుః
ఇదం బ్రాహ్మమ్ ఇదం - క్షాత్రం శాపాదపి శరాదపి.
తే.గీ. నాల్గు వేదముల్ పఠియించి నలువఁ బోలి,
వెనుక శర ధనువులఁ దాల్చు విప్రవరుఁడు,
ధర్మ రక్షకై దీవిం చధర్మముపయి
నస్త్రమును వేయు, నతనికి నంజలింతు.
భావము. నాలుగు వేదాలను నిష్ఠగా పఠించి పృష్ఠ భాగం లో (వీపు ) అమ్ములపొది ని ధరించి, చేతిలో ధనుస్సు తో ఉన్న బ్రాహ్మణుడు అవసరాన్ని బట్టి శాపమూ ఇవ్వగలడు శరమూ ప్రయోగించగలడు. ఆశీర్వాదమూ ఇవ్వగలడు అస్త్రమూ సంధించగలడు. ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ధర్మ పరమైన హింసను కూడా చేపట్టగలడు. సమయాన్ని బట్టి బ్రాహ్మణ ధర్నాన్ని , క్షాత్ర ధర్మాన్ని పాటించగల సద్బ్రాహ్మణుడికి నమస్కరించుచున్నాను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.