జైశ్రీరామ్.
శ్లో. త్రయః కాలకృతాః పాశాః - శక్యన్తే న నివర్తితమ్।
వివాహో జన్మ మరణం - యథా యత్ర చ యేన చ॥
తే.గీ. పుట్టుకయు పెండ్లి మృత్యువు పుడమిపైన
బ్రహ్మ లిఖియించినట్టులే పడయవలయు,
మార్చగానేరరెవ్వరున్, మాన్యులార!
ఎక్క డేదియో పొందెద మక్కడేను.
భావము. వివాహము, జన్మ, మృత్యువు ఈ మూడు కాలపాశములు. ఎప్పుడు
ఎక్కడ ఎవడిచే అనుభవింపఁబడవలెనో అప్పుడు అక్కడ అతడు
అనుభవించవలసినదే! ఇవి మార్చడానికి అసాధ్యమైనవి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.