జైశ్రీరామ్.
శ్లో. ఆశా ధృతిం హన్తి సమృద్ధిమన్తకః - క్రోధః శ్రియం హన్తి యశః కదర్యతాl
అపాలనం హన్తి పశూంశ్చ రాజన్ఏ - కః కృద్ధో బ్రాహ్మణో హన్తి రాష్ట్రమ్ll
తే.గీ. ఆశ ధైర్యమున్, బంధులన్ యముఁడు జంపు,
వసు యశంబులన్ క్రోధ లోభములు చంపు,
పాలనములేమి పశువులన్, బ్రాహ్మణుండు
చంపు కినుకచే రాష్ట్రమున్, సత్యమిదియె.
భావము. "ఆశ ధైర్యాన్ని చంపుతుంది. యముడు పుత్రకళత్ర సమృద్ధిని
చంపుతాడు. కోపం సంపదను చంపుతుంది. లోభం కీర్తిని చంపుతుంది.
అపాలనం (రక్షణం లేకుండుట) పశువులను చంపుతుంది. కోపించిన
బ్రాహ్మణుడు రాష్ట్రమంతటినీ చంపుతాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.