గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మార్చి 2022, మంగళవారం

అన్నవర సమీప గోపాలపట్టణంలో కొలువై యున్న శ్రీ నేరేళ్ళమాంబ సుప్రభాతమ్. రచన. చింతా రామకృష్ణారావు. హైదరాబాదు.

🙏 ఓం శ్రీమాత్రే నమః.🙏

అన్నవర సమీప

గోపాలపట్టణంలో కొలువై యున్న

శ్రీ నేరేళ్ళమాంబ సుప్రభాతమ్.

రచన. చింతా రామకృష్ణారావు. హైదరాబాదు.

నేరేళ్ళాంబ! జయో ఽస్తు తే.

ప్రముఖుల సమీక్షలు

చింతాగ్రస్తులకు మేలుగరిపె  చింతా వారి నేరేళ్ళాంబ  మేలుకొలుపు

బ్రహ్మశ్రీ కొరిడె విశ్వనాథ శర్మ

రిటైర్డ్ ప్రిన్సిపాల్ & సంస్కృత అసోసియేటెడ్ ప్రొఫెసర్….ధర్మపురీ …..తే.19/03/2022.

ఓం గం గణపతయే నమః.

ఓం శ్రీ వాగీశ్వర్యై నమః

       జ్ఞాన వైరాగ్యము లకు భక్తి మాతృక అంటున్నది పద్మ పురాణము. భక్తి కలిగితే క్రమముగా జ్ఞాన

వైరాగ్యములు  పెంపొందుతాయి. జ్ఞాన వైరాగ్యములు లేకపోయినను భక్తి వలన భగవంతునికి

ప్రియుడిగా అవుతాడు ఎందుకనగా 'భక్త ప్రియో మాధవః' అన్నారు.

"నాహం వసామి వైకుంఠే, న యోగిహృదయే, రవౌ, మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద !"

       భక్తులు ఎక్కడైతే నన్ను స్తుతిస్తారో, గానము చేస్తారో అక్కడ నేను ఉంటాను అని భగవంతుఁడు

పేర్కొన్నాడు. భగవంతుని హృదయమును చేరుటకు భక్తియే పరమొత్కృష్టమైన మార్గము. అందుకు

భక్తి సాహిత్యం తోడ్పాటు కలిగిస్తుంది.

       సాహిత్యకారులు నవరసములతోపాటు భక్తిని పదవ రసముగా గ్రహించినారు. భక్తిని

పెంపొందించుటకు వైదిక సాహిత్యముతోపాటు పురాణములు , భక్తి కావ్యములు, నాటకములు,

శతకములు, స్తోత్రములు మొదలైన వివిధ సాహిత్య ప్రక్రియలు వెడలినవి. అందులో సుప్రభాత

సాహిత్యమును స్తోత్ర సాహిత్యంగా పేర్కొనవచ్చు.

       భక్తుడు సూర్యోదయం కంటే పూర్వమే లేచి  శుచియై భగవంతుని నిద్రనుండి మేలుకొలుపుటకై

మనసు నిండా భక్తిని నింపుకొని వివిధములైన భగవద్ వృత్తములను ప్రశంసిస్తూ మేలు కొమ్మని

సున్నితంగా చక్కనైన వృత్తములో మధురమైన గాత్రముతో ప్రయత్నించుటయే సుప్రభాతమునకు

మూలము.

       సుప్రభాత కర్త ముందుగా భక్తి తత్త్వం ఎఱిఁగిన వాడు కావలెను. భగవద్గాథలు, వేద వేదాంత

రహస్యములు తత్త్వములు యెఱిఁగిన వాడు ఐనచో ఆ యా వాఙ్మయ సేవకు వన్నె పెట్టినట్లు అగును.

       ఇక్కడ సుప్రభాతం ఒక లఘు కావ్యంగా తలంచవచ్చును. ఈ లఘు కావ్యంలో సుప్రభాతముతో

పాటు  భగవత్ స్తుతి ,  ప్రపత్తి,  మంగళాశాసనములు కూడా అంతర్భాగములుగా అవుతున్నాయి.

కొన్నిచోట్ల అపరాధ క్షమార్పణ స్తోత్రము కూడా కనబడి మరింత మెరుగులు దిద్దుచున్నవి.

వివిధములైన రూపములలో ఉన్న ఆ భగవంతుని ఏ విధముగా కొలిచినను "సర్వదేవనమస్కారః

కేశవం ప్రతి గచ్ఛతి" అన్నట్లు అమ్మవారి రూపమునందుననూ , అయ్యవారి రూపము నందుననూ ఏ

ఆకారమున కొలిచినను అన్ని నిరాకార పరమాత్మ కే చెందుతాయి.

       కవి శ్రీ శ్రీ చింతా రామకృష్ణ రావు గారు నాకు దాదాపు పదేళ్ల నుండి పరిచయమైనవారు.

ఆత్మీయులు. సహృదయులు. వారి సౌహృదయ‌సుధాంబుధిలో  నన్ను ఓలలాడించినవారు.

శ్రీ రామకృష్ణ రావు గారు నేరేళ్ళాంబ సుప్రభాత ,  స్తుతి ,  ప్రపత్తి ,  మంగళాశాసనములను వ్రాసినారు.

ఉద్దండ పండితులు. అనేక అనేక శతక కర్తలు చిత్ర కవితా దురంధరులు నిరంతరం భక్తి కవితా

రచనాగ్ర చిత్తులు. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు ముందే బ్రాహ్మీముహూర్తముననే లేచి

ముందుగా భగవత్ స్తుతి కరమైన కొన్ని పద్యములు నైనా వ్రాస్తేనే గాని మంచము దిగని వారు.

అట్టివారు పరమ భక్తులు అని చెప్పనక్కరలేదు. నాకు తెలిసి వారి రచనలు అన్నీ కూడా భక్తి సాహిత్య

సుధా రస పూర్ణములైనవే !

       ఇప్పటివరకు చేసిన ఆంధ్ర పద్యముల ద్వారా అమృతమును అందరికీ పంచి యివ్వడమే కాక

ఈ సుప్రభాత రచన ద్వారా సంస్కృతభాషలో  కూడా పాదము మోపి తమ నైపుణ్యాన్ని చూపించి

గీర్వాణ భాషా ప్రియులకు కూడ ప్రియులై, మాన్యులైనారు.

       భాష ఏదైనా కవిలో నున్న భావము ఒకటే కదా !  కనుక ఆ భాషా పదవిన్యాసము పై పట్టు సాధిస్తే ఏ

భాషలోనైనా కవి తన భావ రసాన్ని పంచగలడు. కవిగా తన అభిలాషను దేవికి అంతర్లీనంగా

చెప్పుటలో ఆయన సమర్థుడు. కప్పిపుచ్చే వాడు కవి అని ఉంటారు ఇక్కడ చింతా రామకృష్ణ రావు

గారు ప్రశంసా స్తుతి ని గావిస్తూనె తమ  భక్తుల విషయంలో కోరికలన్నీ టిని కాంతిసమ్మితముగా

కోరినారు. చూడండి.

శ్రీ రమ్య వాక్ సుగుణధే ! శ్రితరక్షణాఢ్యే !

ధీరాది సద్గుణనిధే దినరాజకాంతే !

నేరేళ్ళ నామ  జనని ! త్వమనంత శక్తిః ,

ధారాల వాక్సువరదే ! తవ సుప్రభాతమ్ . (3)

        ఆ తల్లి ని ప్రశంసించుట లో ఎంతో సుమనోహరమైన పద విన్యాసం చదివితేనే మనము ఆ

అమ్మవారి ముందు ఉన్నామనిపించే తన్మయత్వం కలిగించే శైలి. ఈ ప్రశంసలో స్తుతి తో పాటు

అంతర్లీనంగా మంచి రమ్యమైన సుగుణమ్ము లైన వాక్కుల నిమ్మని, రక్షణనిమ్మని,

సద్గుణములనిమ్మని, శరీర కాంతిని యిమ్మని , అనంతమైన శక్తినిమ్మని ఎంత చక్కగా కవి కోరారో కదా !

అదేవిధంగా

శ్రేయస్కరే! భవహరే శ్రితపారిజాతే !

న్యాయస్వరూపిణి ! వరోన్నత సద్విభాసే !

జన్మాది కర్మఫల నాశ మహత్ప్రభాసే !

ధ్యేయాక్షరి ! ద్విషవినాశిని ! సుప్రభాతమ్ (7)

       భక్తులకు శ్రేయస్సును కలిగిస్తూ సంసార బాధలు నివృత్తి చేస్తూ భక్తుల కల్పవృక్షమై

సమస్తాభీష్టములను అందిం పజేస్తూ న్యాయము రక్షిస్తూ , ఈ జన్మ పరంపర కర్మఫలములను

నశింపజేస్తూ మహత్తేజో నిలయమైన ముక్తిని కలిగింప చేయమని అరిషడ్వర్గములు నశింపజేయు

మని ఎంతో ప్రశంసా పూర్వకంగా తెలియజేసినారు.

       ఒక దేవత సుప్రభాతం రాయాలంటే ఆ పరిసర ప్రాంతముల విషయములు కూడా తెలిసి

ఉండాలి.

"గోపాల విశ్రుతపురీ గుణభాస యోషే !" (6)

నేరెళ్ల అంబాదేవి గోపాల పట్టణనిలయ వాసినియని ,

" శ్రీతాండవాభిధ నదీజల నిత్య సేవ్యే!" (17)

తాండవనదీ తీరనివాసినియని , ప్రాంత పరిచయము గావించినారు.

" భక్తా రమా సహిత సత్య విభుం ద్రష్టుం

త్వత్ స్వాజ్జ్ఞయైవ వరమన్నవరం విశంతి ,,..."(9)

అని  ఈ అమ్మవారి అనుగ్రహం వలన ఆజ్ఞ వల్ల ఇక్కడి నుండి అన్నవరం శ్రీ సత్యనారాయణుని

దర్శించడానికి వెళ్ళుతుంటారని చెప్పడము ద్వారా అన్నవర సమీప నివాసినియని,  మార్గోపదేశం

చేసినారు.

యద్యత్త్వనంత శుభకర్మసు బద్ధచిత్తాః

తత్తత్ సుకర్మ ఫలాని త్వదీప్సితాని .

త్వద్వీక్షణేన  నిరపేక్ష్య శుభాని యాంతి .

నేరేళ్ళ మాతృ చరణౌ శరణం ప్రపద్యే .. (20)

       భక్తులు తమ అ పూర్వకర్మ సంచితమైన ఫలములను పొందుట కూడా అమ్మ వారి యొక్క

అభీష్టం మేరకే ఆమె కటాక్ష వీక్షణ చేత కోరకుండానే పొందుతారని తత్త్వమును తెలియజేసినాడు.

       ఒక్కొక్క శ్లోకములో ఒక్కొక్క విశేషము కానవస్తుంది. ఎంత విశ్లేషించిన అంతా రామణీయకత్వం

కనపడుతూ ఉంటుంది. భక్తి పారవశ్యాన్ని పెంపొందించుటతో పాటు భక్తుల హృదయాలలో,

గళములలో చిరస్థాయిగా నిలిచిపోతుందనుటలో అతిశయము కాదని తలుస్తూ…

స్వస్తి.

కొరిడె విశ్వనాథ శర్మ.

 అమ్మకు గొబ్బిళ్ళు.


బ్రహ్మశ్రీ  డా.ఇనగంటి  ఉమారామారావు.

విశ్రాంత నాయాచార్య,

ఆంధ్రగీర్వాణ విద్యాపీఠం,

కొవ్వూరు,

పశ్చిమగోదావరి జిల్లా.

   భారత భూమి కర్మభూమి. దేవతల ఆరాధనలచే  కోరికలు తీర్చుకొని, కోరికలు లేని శ్రీ కైవల్యం

పొందుటకనువైన నేల మనది. ఈ నేలలో నలుచెరగులా దేవతావైభవం ఉట్టిపడుతూ ఉండును. శ్రద్ధ

ఆసక్తి యుంటే అమ్మను కొలుచుకొను అదృష్టం పడుతుంది. అంతటా నీరున్నా రేవులుంటే గాని ఆ

నీరు సులభలభ్యం కాదు. అట్లే అంతటా అమ్మ శక్తి నిండి యున్నా అమ్మ కొలువు తీరిన ఆ గుడులే

మనకు సుఖారాధ్య ద్వారాలు. ఆ జగన్మాత యొక్క పరిపూర్ణ దయను బహు జన్మలందు చేసిన

పుణ్యం వలన పొందినవారు అరుదుగా ఉంటారు. వారిలో ఒకరుయెడ్లశ్రీనివాసు మహోదయులు.

తనకు సంబంధించిన సర్వస్వమూ వెచ్చించుటకైనా వెనుకాడకామ్మకు ఆలయ శోభను సమకూర్చి

అమ్మ దయకు తనలాంటివారినెందరికో పంచుట వారి సుకృతము. ఆ అమ్మను నిత్యమూ

పూజించుటకు తలచుటకు మననం చేయుటకు అనువుగా అక్షరార్చన చేయించు తలంపు మెచ్చుకో

తగినది. అందుకు తగిన కవులనెన్నుకొనుట నేరేళ్ళమ్మవారి దయకు నిదర్శనం బ్రహ్మశ్రీ చింతా

రామకృష్ణారావు కవిగారు అష్టావధానులు. చిత్రకవితా నిపుణులుగా ప్రసిద్ధులు. శ్రీ లలితా మాత యొక్క

సహస్ర నామములకు వేయిపద్యములల్లి సమర్పించిన పుణ్యమూర్తులు. నిరంతర మాతృచింతే

వారింటిపేరు. ఒక్క రోజులో అష్టోత్తరశత అశ్వధాటీ వృత్తములు వ్రాసి రోజుకొక పద్యము పఠన

యోగ్యముగా పంపుట వారి నిత్యకృత్యముగాఇప్పుడు కలిగియున్న ధన్యజీవి.

   నేరేళ్ళమ్మవారి చరిత్ర, వైభవము,   భక్తానురక్తిని, సుప్రభాతంగా ప్రపత్తిగా, స్తుతులుగా అందించి,

భక్తులకు అమ్మవారి కృప వర్షింపఁ జేసి మహోపకారం చేసిన కవివరులకు అందుకు పూనుకొన్న

యడ్లవంశీయులకు, నన్ను భాగస్వామి చేసిన నేరేళ్ళమ్మకు వందనాలతో…

స్వస్తి.

ఆ తల్లికి  ఓ బిడ్డ,

డా.ఇనగంటి  ఉమారామారావు.

తే.01 . 4 . 2022. శ్రీ శుభక్రుత్ నామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమీ స్థిరవారమ్.  

ఓం శ్రీమాత్రే నమః.

ఆనంద భాష్పాంతరంగం.

కృతికర్త.

చింతా రామక్ఉష్ణారావు.

   శ్రీమన్మంగళ దివ్య స్వరూపిణి అమ్మవారు. ఆ తల్లి అనుగ్రహిస్తే అజ్ఞానాంధుఁడయినను సద్విజ్ఞానిగా

వెలుగఁగలడు. ఆ తల్లి చల్లని చూపులు నాకవితకు ఊపిరి పోయుచుండును. . ఆ లోకమాత తన శ్రీలలితా

సహస్రనామములకు పద్యములు నాలోన తానుండి వ్రాయించుకొనినది.  దివ్యమయిన

అశ్వధాటీవృత్తమునకు క్రొత్తవరవడి దిద్ది నాచేత ఇరువదినాలుగు గంటల వ్యవధిలో శతకమే

వ్రాయించుకొనిన కరుణామయి. ఈ జగన్మాత. ఇప్పుడు గోపాలపట్టణమున వెలుఁగుచుండి తన

భక్తుల రూపమున సుప్రభాతము వ్రాయ ప్రేరేపించి తన శక్తిని నాలో నిలుపుకొని వ్రాయించుకొన్నది.

ఇంతటి దయామూర్తి అయిన అమ్మను గూర్చి తెలుపుటకు నాకు మాటలు చాలవు. ఆ అమ్మ

పాదపద్మములకు సాగిలి మ్రొక్కుట తప్ప వేరు పలుక నోరాడదు.

   నా సహోదరుఁడయిన డా.లింగాల సత్యయాజ్ఞవల్క్యశర్మ  గోపాలపట్టణమునందలి

నేరేళ్ళమ్మవారినుద్దేశిచి సుప్రభాతము వ్రాయవలసినదిగా శ్రీ ఎడ్లశ్రీనివాసు తనకు చేసిన విన్నపమును

నాకు తెలియఁజేయగా, అమ్మకు మహత్తరమయిన సుప్రభాతము వ్రాయునంతటి సమర్ధుఁడను కానని

నేనూహించుకొని, ఎవరో ఒకరిరిచే వ్రాయించవచ్చునులే అని భావించి సమ్మతించితిని.

   నాకు సుపరిచితులయిన బ్రహ్మశ్రీ కొరిడె విశ్వనాథశర్మగారికి విషయము తెలియఁజేసి సుప్రభాత రచన

చేయ వలసినదిగా కోరగా… అమ్మ ఆజ్ఞాపించినది మీకు, మీరు తెలుఁగులో అమోఘమయిన

పద్యములలవోకగా వ్రాసియున్నారు. ఈ సుప్రభాతము వ్రాయుట మీకు అసాధ్యము కాదు. తప్పక మీరే

వ్రాయఁ గలరు. ప్రయత్నించి వ్రాసి నాకు చూపినచో అవసరమగు మెఱుగులు దిద్దుటలో

సహకరించఁ గలనని పలికి నన్ను ప్రోత్సహించిరి.

   చేయఁగలిగినది లేక ఆ జగన్మాతపైననే భారము వేసి వ్రాయుట ప్రారంభించి ఐదు శ్లోకములు

మచ్చునకు వ్రాసి శ్రీ విశ్వనాథశర్మగారికి చూపఁగా వారి సహజధోరణిలో నన్ను ప్రశంసలలో ముంచెత్తి ఈ

కార్య నిర్వహణ నాకనివార్యముగా చేసిరి. వారి ప్రోత్స్ఆహముతో శ్లోకములు అకుంఠితముగా వ్రాయుచు

వారికి చూపుచుండగా వారు చూచుచు అవసరమగు సూచనలు చేయుచు నాచేత ఈ పని పూర్తి చేయించిరి.

వారి అభిమానమునకు ధన్యవాదములు.

   నా సహోదరుఁ యాజ్ఞవల్క్యశర్మ అంతయూ చూచి ప్రశంసించుటే కాక, తే.18 . 3 . 2022న ఈ

సుప్రభాతమును ఆవిష్కరణకు వెన్వెంటనే ప్రయత్నించి అమ్మవారిపై తనకుగల తపనను

చూపించుకొనెను.

   శ్రీ ఎడ్ల శ్రీనివాస్ ఈ నేరేళ్ళమ్మ ఆలయ పునరుద్ధరణకు ద్ఉఢచిత్తుఁడై శారీరక మానసిక ఆర్థిక

వ్యయప్రయాసలను లెక్క చేయక అణువణువునా ఆ జగన్మాతనే చూచుచు, నిరంతరమూ అమ్మ సేవకై

తపించుచు, ఈ సుప్రభాత రచన పూర్తి అయిన వార్తకు ఎంతగానో ఉప్పొంగుచు ఆవిష్కరణ

కార్యక్రమమును గంటల వ్యవధిలో ఏర్పాటు చేసి గ్రామ పెద్దల, భక్తుల సమక్షమున ఎంతో వేడుకగా పూర్తి

చేసిరి. వీరు మాపై చూపిన ఆదరణ అసాధారణమైనది. అమ్మ వీరి లక్ష్యములను పూర్తిగా తప్పక నెరవేర్చి

తీరును.

   ఇక నేను తెలుఁగులో పద్యములేదో వ్రాయుచుండెడివాడనే కాని సంస్కృతమున వ్రాయు సాహసము

పెద్దగా చేసినవాడను కాను. ఐననూ అమ్మ అనురాగము కలిగినచో ఏది మనకు సాధ్యము కాకుండా

ఉండును?  అత్తల్లియే వ్రాయించుకొన్నది.

   దృష్ఠం కిమపి లోకేస్మిన్ న నిర్దోషో న నిర్గుణః.

ఎంచనెంచినచో  దోషరహితమయినది గుణరహితమయినదీ ఏదీ ఉండదని పెద్దలు చెప్పియున్నారు.

యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబుమిశ్రమ్.

క్షీర నీర మిశ్రమమునుండి హంస క్షీరమును గ్రహించి నీరమును విడిచిపెట్టును. అదే విధముగా

సహ్ఉదయులగు పాఠకులు.ఇందలి మంచినే గ్రహింతురుగాక.

   ఆవిష్కరణ సమయమున నన్నాదరించిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను.

తాము నన్ను ప్రోత్సహించుటయే కాక తమ అమూల్యమయిన అభిప్రాయమును ప్రేమతో వ్రాసి

యిచ్చిన బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథ శాస్త్రిగాకి,  బ్రహ్మశ్రీ ఇనగంటి ఉమారామారావు గారికి నా ధన్యవాదములు

తెలియఁజేసుకొనుచుంటిని.

   నా సహోదరుఁడు డా.లింగాల సత్యయాజ్ఞవల్క్యశర్మ ప్రేరణకు చాలా సంతోషము కలిగినది. వీనికి నా

ఆశీస్సులు అందజేయుచూ అమ్మ అనుగ్రహము వీనికి నిరంతరమూ ఉండవలెనని ఆకాంక్షించుచుంటిని.

   మన నేరేళ్ళమ్మ తల్లి యొక్క అనుగ్రహం కలిగి నిరంతరమూ గ్రామము నిత్య శోభనపరంపరలతో

నిత్యకల్యాణము పచ్చ తోరణములతో కలకాలము వర్ధిల్లవలెనని మనసారా కోరుకొనుచుంటిని.  ఈ

అవకాశము కలిగించిన శ్రీ ఎడ్లశ్రీనివాసరావు పార్వతి దంపతులకు, మాతమ్మునకు నా సంతోషమును

తెలియజేసుకొనుచుంటిని. అమ్మకు వందనములతో..  

సద్విధేయుఁడు,

చింతా రామకృష్ణారావు.

కృతి సమర్పణ. (తెలుగులో)

కొర లే దో శశిమౌళి! నాకుఁ, దలపన్  గూఢాక్ష  మే నీవుగా,

గురి నీపైన జనించె, నాథు కృపయే గూర్పించె మేల్కొ ల్పిటన్,

హరుఁడే గాంచగ విశ్వ వేద్యుఁడుగ, నే నర్పిం చెదన్ నిల్పి నీ

స్మరణన్ వందిత విశ్వసంస్తుతకృతిన్ భావించెదన్ నిన్నటన్.

భావము

శశిమౌళివయిన తల్లీ!ఆలోచించగా నాలో కనిపించకుండా ఉండెడి జ్ఞాన నేత్రమే నీవయి యుంటివి

కదా. నీపై నాకుఏకాగ్ర చిత్తము ఏర్పడినదమ్మా. లోకనాథుఁడయిన నీ పతిదేవుఁడే  సుప్రభాతమును

నాచేత వ్రాయించెను.. చూడగా పరమేశ్వరుడేకదా లోకమున తెలియఁదగినవాఁడు. నీ సంస్మరణ

చేయుఉ లోకనాథునకు నిన్ను ఊహించుకొనుచు  గౌరవిపదగినలోకముచే పొగడఁబడెడి 

సుప్రభాత కృ తిని నేను సమర్పింతును తల్లీ!



అన్నవర సమీప

గోపాలపట్టణంలో కొలువై యున్న

శ్రీ నేరేళ్ళమాంబ సుప్రభాతమ్.

రచన. చింతా రామకృష్ణారావు. హైదరాబాదు.

1. శ్రీమద్భక్తాశ్రయే ! దేవి ! పూర్వాసంధ్యా ప్రవర్తతే ,

నేరేళ్ళ దేవి! ఉత్తిష్ఠ కర్యవ్యం భక్త రక్షణమ్ .

భావము

భక్తులకు ఆశ్రయమగు శుభప్రదా! దేవీ! తూర్పు దిక్కున సంధ్యా  సమయము అగుచున్నది.

నేరేళ్ళమ్మ తల్లీ! మేల్కొనుము. భక్తులను రక్షించుట నీ కర్తవ్యమయి యున్నది.

 

2. ఉత్తిష్ఠోత్తిష్ఠ జనని ! ఉత్తిష్ఠ శుభకారిణి !

నేరేళ్ళ  భవ్య సన్నామ్ని! ఉత్తిష్ఠ మహిమాన్వితే !

భావము

లోకమాతా! లే లెమ్ము. శుభకారిణీ లెమ్ము. నేరేళ్ళమ్మ అను  గొప్ప పేరు గల తల్లీమహిమలు కల

జననీ! లెమ్ము

 

3. శ్రీ రమ్య వాక్ సుగుణధే ! శ్రితరక్షణాఢ్యే !

ధీరాది సద్గుణనిధే దినరాజకాంతే !

నేరేళ్ళ నామ  జనని ! త్వమనంత శక్తిః ,

ధారాల వాక్సువరదే ! తవ సుప్రభాతమ్ .

భావము.

మంగళప్రదమయిన వాక్కులు కలిగిన సద్గుణములకు స్థానమయిన తల్లీఆశ్రితులను రక్షించు తల్లీ!

ధైర్యము మున్నగు మంచి గుణములకు నిధివైన తల్లీసూర్యునివలె ప్రకాశించు మాతా! అంతు లేని

శక్తిమంతురాలివయిన  నేరేళ్ళమ్మ తల్లీ!మంచి మాటలాడెడి శక్తిని ప్రసాదించు తల్లీనీకు

శుభోదయము.

 

4. ప్రాతః  స్మరంతి తవ శోభన దివ్యరూపమ్ ,

ప్రాతర్భజంతి సుజనా  భవదీయ తేజః ,

ప్రాతర్నమంతి శిరసా తవ దర్శనార్థమ్ ,

ధౌతప్రభే! శుభయుతే ! తవ సుప్రభాతమ్ .

భావము.

సుజనులు ప్రాతః కాలములో నీ మంగళప్రదమగు రూపమును స్మరించుకొనుచున్నారు.

సుజనూవయిన నీ భక్తులు ప్రాతః కాలముననే నీ తేజస్సును భజించుచున్నారు. నిన్ను చూచుట

కొఱకు శిరసువంచి  నమస్కరించుచున్నారుగొప్ప ప్రకాశము కలదానా! శుభములతో 

కూడుకొనిన తల్లీ! నీకు శుభోదయము.

 

5. పౌరాణికోత్తమ నుతే ! భవబంధ నాశే !

శ్రీ రత్నశైలనుత భాసిత సన్నిధానే !

క్షీరాబ్ధిజే ! సుపరివాసిత పుణ్య రాశే !

ధారాల వాక్సుఝర దే ! తవ సుప్రభాతమ్ .

భావము.

పౌరాణికోత్తములచే ప్రశంసింపఁబడు మాతా! పుట్టుట మున్నగు  బంధములను నశింపఁజేయు

తల్లీ!ప్రశంసింపఁబడుమంగళప్రదమయిన రత్నగిరిసమీపమున ఉన్న మా తల్లీ! క్షీరాబ్ధిజా!మంచిగా 

పుణ్యప్రదేశమున వశించుచున్న తల్లీ! ధారాళమయిన మంచి వాక్ధారను ప్రసాదించు జననీనీకు

శుభోదయము.

 

6. గోపాల విశ్రుతపురీ గుణభాస యోషే !

సద్భక్తబృంద పరిసేవిత పాదపద్మే !

పాపౌఘ నాశనపటో ! పరమేశ పత్ని !

తాపోపశాంతి ఫలదే ! తవ సుప్రభాతమ్ .

భావము.

గోపాలపట్టణమున మహత్తరమయిన గుణములతో ప్రకాశించు తల్లీ! మంచి భక్తుల సమూహముచే

సేవింపఁబడు శుభప్రదమయిన పాదపద్మములు కల అమ్మా! పాపముల సమూహమును

నశింపచేయుట యందు నైపుణ్యముకల మాతా! పరమేశ్వరుని అర్థాంగివైన

జననీ!తాపమును నశింపజేయుట అనెడి చక్కని ఫలితమునిచ్చు జననీ! నీకు శుభోదయము.

 

7. శ్రేయస్కరే! భవహరే శ్రితపారిజాతే !

న్యాయస్వరూపిణి ! వరోన్నత సద్విభాసే !

జన్మాది కర్మఫల నాశ మహత్ప్రభాసే !

ధ్యేయాక్షరి ! ద్విషవినాశిని ! సుప్రభాతమ్ .

భావము.

మంచిని కలిగించు తల్లీ! భవమును హరించు జననీ! ఆశ్రిత పారిజాతమా న్యాయ స్వరూపిణీ!

శ్రేష్ఠమయిన మహౌన్నత్యమయిన మంచిచే ప్రకాశించు మా తల్లీజన్మించుట మొదలుగాగల

కర్మఫలములను నశింపఁజేయు గొప్పగా ప్రకాశము  కలదానా! ధ్యేయముతో కూడిన అక్షరస్వరూపిణీ!

వైషమ్యములు నశింపఁజేయు తల్లీ! నీకు శుభోదయము.

 

8. శ్రీభాస్కరారుణ మహద్ద్యుతి శోభితాద్రిః

త్వద్దర్శనోత్సుక విరాజిత పుష్ప నేత్రః

ద్వారేఽత్ర తిష్ఠతి వికాస ముఖారవిందే !

ఉత్తిష్ఠ లోక శుభదే ! తవ సుప్రభాతమ్ .

భావము

మంగళప్రదుడయిన సూర్యనారాయణుని అరుణ కాంతులతో గొప్పగా ప్రకాశించుచున్న 

ఉదయపర్వతము నీ దర్శనము చేసుకొన వలెననెడి కుతూహలముతో వికసించిన పుష్పములనెడి

కన్నులతో ఇక్కడ ద్వారము వద్దయున్నది.  ప్రకాశించుచున్న ముఖపద్మము కల తల్లీలోకములకు

శుభములను చేకూర్చు జననీమేలుకొనుమునీకు  శుభోదయము.

 

9. భక్తా రమా సహిత సత్య విభుం ద్రష్టుం

త్వత్ స్వాజ్జ్ఞయైవ వరమన్నవరం విశంతి ,

తద్భక్త కోటి పవరివాంఛిత సత్ప్రదే ! త్వమ్

ఉత్తిష్ఠ , లోక శుభదే ! తవ సుప్రభాతమ్ .

భావము.

భక్తులు రమాసత్యనారాయణుల దర్శనము చేసుకొనుట కొఱకునీ అనుజ్ఞార్ధము  వచ్చి అన్నవరమున

ప్రవేశించుచుండిరి, అట్టి భక్తుల మంచి కోరికలను తీర్చు  తల్లీ! నీవు మేలుకొనుము. లోకమునకు 

శుభములు చేకూర్చు తల్లీనీకు శుభోదయము.

 

10. మందార పుష్ప పరి శోభిత శుభ్ర దేశే ,

సౌందర్య పూరిత మనోజ్ఞ లతా వితానే

శ్రీమందిరే , వర ! సుపూజ్య విరాజమానే !

ఉత్తిష్ఠ దివ్య చరణే ! తవ సుప్రభాతమ్ .

భావము.

శ్రేష్టురాలా! మందారము పూవులతో గొప్పగా కళగా ఉన్న పవిత్ర ప్రదేశముననుకనులకు ఇంపు

గొలిపెడి లతానికుంజములతోనుమంగళప్రదమయి  యొప్పుచున్న మందిరమున గొప్పగా 

పూజింపఁబడుచు ప్రకాశించుచున్న తల్లీమహత్తరమయిన పాదపద్మములు కల జననీ

లెమ్మునీకు శుభోదయము.

 

11. దేదీప్యమాన భవదీయ ముఖారవిందం

నేత్రోత్సవం భవతి దర్శన భాగ్యమాత్రాత్ ,

తద్భాగ్య దే ! సుఫలదే ! వరదాంబ ! దేవి !

ఉత్తిష్ఠ ! సన్నుత శివే ! తవ సుప్రభాతమ్ .

భావము

మిక్కిలి ప్రకాశవంతమయిన నీ ముఖ పద్మముచూచు వారికి చూచినంత మాత్రమున  కనులకు

ఆనందము కలుగు చున్నదిఅట్టి భాగ్యమునొసంగు తల్లీ! సత్ ఫలితములనే యొసంగు జననీ!  

వరముల నొసంగు తల్లీ జననీలెమ్ము. ప్రశంసింపఁ బడిన మంగళ దేవతా! నీకు శుభోదయము.

 

12. యడ్లాన్వయో వినుత సద్గుణః శ్రీనివాసః

భార్యాయుతః సుగుణ నిర్జిత శత్రుషట్కః ,

త్వత్సేవనాయ నను తిష్టతి లోక మాతః !

ఉత్తిష్ఠ భక్త వరదాయిని ! సుప్రభాతమ్ .

భావము.

లోకమాతా! తనకు గల సుగుణములచే అరిషడ్వర్గమును జయించిన  వాఁడుఎడ్లవారి

కుటుంబమునకు చెందిన ప్రశంసింపఁబడు శ్రీనివాస అనే పేరు కలవాడు  తన భార్యా సమేతుఁడయి నీ

సేవ చేయుట కొఱకు వేచియుండెను భక్తవరదాయినివయిన తల్లీ! లెమ్ము. నీకు శుభోదయము.

 

13. సత్కావ్య కల్పన చణా భవదీయ తత్త్వమ్

జ్ఞాత్వాఽపి యోగ్యరహితాః ఖలు వర్ణనాయ

త్వ త్సేవనా త్పరమ శక్తి మవాప్నువంతి ,

శ్రేయఃప్రదే ! విజయదే ! తవ సుప్రభాతమ్ .

భావము.

మంచి కావ్యములు విరచించుటయందు నిపుణులైనవారు సహితము నీ యొక్క తత్త్వమును

తెలినవారైనప్పటికీ నిన్ను వర్ణించుటకు చాలరయిరి.  నీ యొక్క సేవ చేసుకొనుటవలన

అద్భుతమయిన శక్తిని పొందఁ గలుగుదురుశ్రేయస్సును కలిగించు తల్లీ! విజయములిచ్చెడి 

అమ్మా! నీకు శుభోదయము.

 

14. యడ్లాన్వ యోజ్వలిత సన్నుత భాగ్య రాశే !

పూర్వోదయాద్రిజ విశేష మహారుణాంకః

త్వత్పాద దర్శన కుతూహల రశ్మి భానుః  

ద్వారే ೭త్ర తిష్ఠతి, శివే ! తవ సుప్రభాతమ్ .

భావము.

ఎడ్ల వంశమున ప్రభవించిన తల్లీ! ప్రకాశించెడి పొగడ బడెడి సర్వసౌభాగ్య రాశివయిన జననీ!

తూరుపు కొండపై ఉదయించిన, ప్రత్యేకత కలిగిన అరుణ వర్ణముతో భానుడు నీ పాద దర్శన

కుతూహలుఁడై వెలుగుచుండి ఇక్కడ నీ గుడి ముఖద్వారమున చూచుచు నిలుచి యుండెను.

పరమేశ్వరీనీకు శుభోదయము.

ప్రపత్తిః

15. పాపాపహార వర నామ సుధా స్రవంతౌ !

జ్ఞానప్రభాంచిత దృగంచల చంద్రికాభౌ

గోపాల పట్టణ మహద్ద్యుతి మూల శక్తౌ !

నేరేళ్ళమాతృ చరణౌ శరణం ప్రపద్యే .

భావము.

పాపములను హరించెడి శ్రేష్టమయిన నామ సుధా ప్రవాహ మయినదియుజ్ఞానమును ప్రసాదించెడి

ఒప్పిదమయిన కడగంటి చూపులనెడి మంగళప్రదమయిన వెన్నెల కలదియు, గోపాలపట్టణము

యొక్క ప్రసిద్ధికి మూలశక్తియు అయిన నేరెళ్ళమాంబ పాదములను శరణుజొచ్చెదను.

 

16. దీనావ నాభినుత సుందర దివ్య హస్తౌ !

మానాభిమాని పరిరక్షణ చిత్త భాసౌ !

సద్భక్తమండల సుపూజిత పాదయుగ్మౌ !

నేరేళ్ళమాతృ చరణౌ శరణం ప్రపద్యే .

భావము.

దీనులను కాపాడుట యందు పొగడఁ బడెడి దివ్యమయిన చేతులు కలదిమానాభిమానములను

పరిరక్షించు మనసుతో ప్రకాశించునది, మంచి భక్తుల సమూహముచే బాగుగా పూజింపఁ బడుచున్న

పాదపద్మద్వయము కలది,  అయిన నేరెళ్ళమాంబ యొక్క పాదములను శరణు జొచ్చెదను.

 

17. శ్రీతాండవాభిధ నదీజల నిత్య సేవ్యౌ !

నిత్యోజ్జ్వల ఛ్ఛివద దేహలతే మదంబ !

చంద్రాగ్ని సూర్య యుత సన్నుత నేత్ర భాసౌ !

నేరేళ్ళమాతృ చరణౌ శరణం ప్రపద్యే .

భావము

శుభప్రదమయిన తాండవ నదీ జలములతో నిత్యమూసేవింపబడునట్టిదియు,నిత్యమూ మిక్కిలి

ప్రకాశించుచుండెడి మంచిని కలిగించునట్టిదియు,కోమలమయిన శరీరము కలదియు, చంద్రుఁడు

అగ్నియు సూర్యుఁడు కలిగిన మూడు కన్నులతో ప్రకాశించునదియునా తల్లియు అయిన  నేరెళ్ళాంబ

పాదములను శరణు జొచ్చెదను.

 

18. ఆజన్మ దుఃఖ పరి పీడిత మానవాలిః ,

త్వత్పాద కల్ప విటపం  శరణం ప్రపన్నాః ,

మద్దుఃఖ హారిణి ! లసద్ద్యుమణే ! శుభౌ తౌ

నేరేళ్ళ మాతృ చరణౌ శరణం ప్రపద్యే .

భావము.

జన్మించినది మొదలు (సాంసారిక) దుఃఖముచే మిక్కిలిపీడించబడుచున్న మానవ సమూహము నీ

పాదములు అనెడు కల్పవృక్షమును శరణు పొందుతున్నారు. నా దుఃఖము లను హరింపఁ జేసెడి

దేవీప్రకాశించే సూర్య కాంతి వంటిదానాశుభంకరీ! నేరెళ్ళమాతృ మూర్తి వైన నీ పాదములను 

శరణు పొందుతున్నాను.

 

19. శ్రీసత్యదేవ చరణాశ్రిత భక్తవర్యాః

త్వత్పాద దర్శన ఫలేన గుణాన్ లభన్తే .

భద్రాకృతే ! శుభ నిధే ! విజయప్రదే ! తౌ

నేరేళ్ళ మాతృ చరణౌ శరణం ప్రపద్యే .

భావము.

లక్ష్మీ సమేయుఁడగు సత్యదేవుని పాదముల నాశ్రయించు భక్తుల సమూహము నీ పాద దర్శన ఫలముచే

శౌర్యాది గుణములను పొందుచుండిరిభద్రాకారము కల తల్లీ శుభ నిధానమా! జయముల నొసఁగు

జననీనేరెళ్ళమ్మా! నీ పాదములను శరణు పొందుచుంటిని.

 

20. యద్యత్త్వనంత శుభకర్మసు బద్ధచిత్తాః

తత్తత్ సుకర్మ ఫలాని త్వదీప్సితాని .

త్వద్వీక్షణేన  నిరపేక్ష్య శుభాని యాంతి .

నేరేళ్ళ మాతృ చరణౌ శరణం ప్రపద్యే .

భావము.

ఏయే అనంతమయిన శుభప్రదమయిన కర్మలయందు బద్ధమైనచిత్తము కలవారు ఆయా మంచి కర్మల

వలన కలిగెడి ఫలములు నీవు కోరుకొనినవే, నీ చూపుల చేతనే అపేక్షింప కుండగనే  శుభములు కలుగు

చున్నవి నేరేళ్ళమ్మ తల్లి యొక్క పాదములనే శరణుపొందుచుంటిని.

 

స్తోత్రః

21. సకలాగమశాస్త్ర నిధే ! జనని !

నిగమాంత సువేద్య ప్రశస్త రమే !

సుగుణాకర భక్తచయే ! వరదే !

విజయా భవ సన్నుత మాతృవరే.

భావము

సమస్తమయినటువంటి వేద శాస్త్రములకు మూలమైనదానా! ఓతల్లీ!వేదాంత సారముగా తెలియఁ బడు

ప్రశస్తమయిన లక్ష్మీ స్వరూపిణీమంచిగుణములకు స్థానమయిన భక్తుల సమూహము కలిగిన తల్లీ

వర ప్రదాయినీ!ప్రశంసింపఁబడు జ్ఞానపూర్ణవయిన అమ్మా! నీకు విజయమగుగాక.

 

22. కలికాలజ కల్మష నాశ మతే !

ప్రళయాంతక దుష్ట వినాశ చణే !

శ్రుతి ధర్మ సుపాలన దక్షమతే !

విజయా భవ శ్రీకర మాతృ సుధే !

భావము.

కలికాలమున సంభవించెడి కల్మషములను నశింపఁ జేయు గొప్ప మనసు ఉన్న అమ్మా!

ప్రళయాంతకులయిన దుర్మార్గులను నశింపఁ జేయుటయందు నిపుణురాలివయిన  లోక మాతా! వేద

ధర్మ పరిపాలనమున దక్షతనొప్పెడి హృదయముకలిగిన జననీ! శుభప్రదవయిన జ్ఞాన పూర్ణవయిన 

మాత్రుమూర్తీనీకు విజయము కలుగు గాక.

 

23. పరమాద్భుత సత్కవితారసదే ,

వరణీయ మహోన్నత భావసుధే !

పరికల్పిత సఛ్ఛుభ కార్య నిధే !

విజయా భవ శోభిత మాతృ సుధే !

భావము.

గొప్ప అద్భుతమయినమంచికవితారసమును ఉప్పొంగించు తల్లీప్రశంసింపఁ దగిన

మహోన్నతమయిన భావామృతమూర్తీ! సృష్టింపఁ బడిన మంచి శుభప్రదమయిన పనులకు

స్థానమయిన అమ్మా! ప్రకాశించెడి జ్ఞాన పూర్ణవయిన మాతా! నీకు విజయమగు గాక.

 

24. విజయాశ్రయ సౌమ్య ముఖాంబురుహే ,

వరదే! శుభ నామ మదంబ! సుధే !

జలజాత జిదక్షి ! సుగణ్య మతే !

విజయాభవ శాంకరి ! భక్త నుతే .

భావము.

విజయములకు ఆశ్రయమయిన సౌమ్యముగా నొప్పియున్న ముఖపద్మము కలదానా! వర ప్రదాయిని

వయిన తల్లీ! శుభనామముతో నొప్పెడి నా సుధాంబుధి వయిన జననీ! పద్మముల వంటి కన్నులు

గల జననీ! ప్రశంసింపఁబడు  హృదయమున్న మాతా! భక్తులచే పొగడఁబడు నేరేళ్ళమ్మ తల్లీ!

శాంకరీ! నీకు విజయమగుగాక.

 

25. నిరతాక్షయ సద్వరదే  వినుతే

ప్రవరార్చనతత్పర భక్తతతే !

పరమామృత సత్కవనాభినుతే ,

విజయాభవ  రక్షణశీలవతి!

భావము.

నిరంతరము అంతు లేని మంచి వరములను ప్రసాదించు జననీప్రశంసింపఁబడు తల్లీ! సద్గుణములు

గల మంచి భక్తులచే మంచిగా సేవింపఁ బడు అమ్మా! గొప్ప అమృతోపమాన మయిన కవిత్వమునందు 

ప్రశంసింపబడు జననీ! రక్షించెడి స్వభావము కలిగిన నేరెళ్ళాంబానీకు జయమగుగాక.

మంగళాశాసనమ్.

26. ఓంకార పూర్ణ రూపాయై 

సృష్టి నిర్మాణ హేతవే

నేరేళ్ళమాతృ రూపిణ్యై

ముక్తిదాయై సుమంగళమ్ .

భావము.

ఓంకార పూర్ణ రూపమయినదియు, సృష్టి నిర్మాణమునకు కారణమయినదియునేరేళ్ళ అను పేరుతో

ప్రకాశించు జననికి, ముక్తిప్రద అయిన తల్లికి మంగళ మగుగాక.

 

27. చిన్ మయానంద రూపాయై చింతితార్థద తేజసే ,

తాపోపశాంతయే , దేవ్యై , యడ్లజాయై సుమంగళమ్ .

భావము.

చిన్మయానంద రూపిణికి, భావించిన దానిని ప్రసాదించు తేజస్సు గలిగిన తల్లికి, తాపమును హరించు

జననికి, గొప్పదైన అమ్మకు, ఎడ్లవంశసంజాతకు శుభమంగళము.

 

28. రాగద్వేష గుణాతీతే , రమ్య సద్గుణ శోభితే ,

త్స రాది ద్విషణ్ణాశే ! మంగళాయై సుమంగళమ్ .

భావము.

అనురాగ ద్వేషములకు అతీతమయిన తల్లికి, మనోహరమయిన మంచి గుణములతో ప్రకాశించు

జననికి, మత్సరాది దుర్గుణముల కతీతమయిన మాతృమూర్తికి మంగళాంగి అయిన నేరేళ్ళమ్మతల్లికి

మంచి మంగళములగు గాక.

 

29. కృష్ణాలకప్రకాశిన్యై , కృపా సాగర మూర్తయే ,

రావోద్భూత మహోంకారే ! తుభ్యం మాత్రే సుమంగళమ్ .

భావము.

నల్లని అద్భుతమయిన శిరోజములు కల అమ్మకు,కృపాసముద్రమే స్వరూపమా అన్నట్లు ఉండు

అమ్మకు, శబ్దము నందు ఉద్భాసించు గొప్ప ఓంకార స్వరూపిణికిఎడ్లవంశజ అయిన

నేరేళ్ళమాంబకు మంచిగా మంగళమగుగాక.

 

30. సన్నుతాంఘ్రి ద్వయే ! తుభ్యం, శ్రీమద్భక్త సమన్వితే ,

నిత్య పూజ్యే ! నిర్వికారే ! లోకమాతః ! సుమంగళమ్ .

భావము.

ప్రశంసార్హమయినపాద ద్వయము కలిగిన నీకు, శుభప్రదులయిన భక్తులతోకూడుకొనిన నీకు,నిత్య

పూజ్యవు, నిర్వికారవు అయిన నీకులోకజననివయిన నీకు మంగళమగుగాక.

 

31. ప్రసన్నే పంచకోశస్థే ! ప్రఖ్యాత శుభ లక్షణే ,

యోగినామాత్మ వర్తిన్యై భక్తిదే ! తేఽస్తు మంగళమ్ .

భావము,

ప్రసన్న స్వరూపిణి, పంచ కోశస్థ, ప్రఖ్యాత శుభలక్షణ, అయి, యోగుల ఆత్మలందు  సంచరించుచు

భక్తిని ప్రసాదించు నేరేళ్ళమ్మకు మంగళము.

 

32. శ్రీమన్మంగళ రూపాయై , గోపపత్తన సంస్థితే

భక్తానన విభా‌సిన్యై ఏడ్లజాయై సుమంగళమ్ .

భావము

మంగళప్రదమయిన మంచి రూపము గల తల్లికి, గోపాలపట్టణమున ఉండు జననికి, భక్తుల

ముఖములలో ప్రకాశించునట్టి అమ్మకు, ఎడ్లవంశ సంభవ అయిన నేరేళ్ళమ్మ తల్లికి మంగళమగు గాక.

 

33. రామకృష్ణ ప్రపూజ్యాయై , శోభనాక్షర భాసి తే,

దివ్య నేరేళ సన్మాత్రే  మంగళం నిత్యమంగళమ్ .

భావము.

రామకృష్ణచేత బాగుగా పూజింపఁబడు తల్లికి, మంగళప్రదమయిన అక్షరములతో శోభిల్లునటువంటి,

దివ్యమయిన నేరేళ్ళమ్మతల్లికిమంగళమునిత్యమూ మంగళము అగు గాక.

ఫలశ్రుతి.

34.  చింతా వంశజ రామకృష్ణ కవితాం , నేరేళ్ళ దేవీ ప్రభాం ,

యః ప్రాతస్సమయే సదా నను పఠే న్నేరేళ్ళమాతృ కృపామ్

సత్యం ప్రాప్య సుఖం విందతి సదా , నేరేళ్ళమాతుః స్తవాత్

తద్భక్తోజ్జ్వల కారకోఽస్తు వరద శ్శ్రీ సత్య నారాయణః .

భావము.

చింతావారి యింట జన్మించిన రామకృష్ణారావు యొక్క కవిత్వమయిన సుప్రభాత రూపముననున్న శ్రీ

నేరెళ్ళమ్మపేరుగల యీ దేవీ ప్రభను నిత్యమూ ప్రాతః కాల సమయమున ఎవరు పఠించుచుందురో

వారు నేరెళ్ళమాంబ కృపకు పాత్రులై

నిత్యమూసుఖాస్పదులగుదురునేరెళ్ళాంబ సంసేవనా ఫలముగా అట్టి భక్తుల ఔన్నత్యమునకు 

శ్రీ సత్యనారాయణ స్వామివారు  కారణ మగుదురు.

స్వస్తి.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.