గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2010, ఆదివారం

పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 5 వ భాగము.


ఓం నమో నారాయణాయ.
పురుష సూక్తము (5 వ భాగము)

తస్మాదశ్వా అజాయన్త, యేకే చోభయా దతః, గావోహ జజ్ఞిరే తస్మాత్,  తస్మా జ్జాతా అజా వయః, యత్ పురుషం వ్యదధుః. కతిథా వ్యకల్పయన్,  ముఖం కిమస్య కౌ బాహూ, కా వూరూ పాదా వుచ్యేతే, బ్రాహ్మణోzస్య ముఖ మాసీత్, బాహూ రాజన్యః కృతః. ౫. 
ప్రతిపదార్థము:-
తస్మాత్ = ఆ యాగము వలన,
అశ్వా= గుఱ్ఱములును,
యేకేచ = ఏవియేవి,
ఉభయాదత: = ఊర్ధ్వాధోభాగములందు దంతములు గలవియు,
(తేzపి = అవియు)
అజాయంత = పుట్టెను.
తస్మాత్ = ఆ యజ్ఞము వలన, 
గావోహ = గోవులును,
జజ్ఞిరే = కలిగెను.
తస్మాత్ = ఆ యజ్ఞము నుండి,
అజా = మేకలూ,
అవయ: = గొఱ్ఱెలునూ,
జాత: = పుట్టెను.
యత్ = ఎప్పుడు,
దేవా: = దేవతలు,
పురుష: = విరాడ్రూపమును,
వ్యదధు: = సంకల్పము చేత పుట్టించిరో
(తదానీం = అప్పుడు)
కతిథా = ఎన్ని ప్రకారములుగా,
వ్యకల్పయన్ =విషయము కల్పించిరి.
అస్య = ఈ విరాట్టునకు,
ముఖం = ముఖమును,
కిం = ఏది,
బాహూ = రెండు భుజములు,
కౌ = ఏవి,
ఊరూ = రెండు తొడలును,
పాదౌ = రెండు పాదములును,
కౌ = ఏవి,(అవి)
ఉచ్యతే = చెప్పఁబడుచున్నవి.
అస్య = ఈ విరాట్టునకు,
బ్రాహ్మణ: = బ్రాహ్మణుఁడు,
ముఖం = ముఖము,
ఆసీత్ = ఆయెను.
రాజన్య: = క్షత్రియుఁడు,
బాహూ = భుజములుగా,
కృత: = చేయఁబడెను.

దండాన్వయము:-
ఆ యాగము వలన, గుఱ్ఱములును, ఏవి యేవి ఊర్ధ్వాధోభాగములందు దంతములు గలవియు, అవియు పుట్టెను. ఆ యజ్ఞము వలన, గోవులును కలిగెను. ఆ యజ్ఞము నుండి మేకలూ, గొఱ్ఱెలునూ పుట్టెను. ఎప్పుడు దేవతలు విరాడ్రూపమును సంకల్పము చేత పుట్టించిరో, (అప్పుడు)ఎన్ని ప్రకారములుగావిషయము కల్పించిరి. ఈ విరాట్టునకు, ముఖమును, ఏది రెండు భుజములు, ఏవి రెండు తొడలును, రెండు పాదములును, ఏవి, (అవి)చెప్పఁబడుచున్నవి. ఈ విరాట్టునకు బ్రాహ్మణుఁడు ముఖముగా ఆయెను. క్షత్రియుఁడు భుజములుగా చేయఁబడెను.
సీ:-
ఆ యాగ ఫలముచే నమరె గుఱ్ఱములును,
దంతంబులున్నట్టి జంతువులును,
ఆ యాగ ఫలముచే నావులు కలిగెను,
మేకలు, గొఱ్ఱెలుఁ మేల్తరముగ.
ఎప్పుడు  దేవత లీవిరాట్ రూపమ్ము
సంకల్పమును జేసి చక్కఁగొలిపి
రప్పుడే కల్పించిరన్ని ప్రకారముల్
విషయము లెలమిని విదితముగను.
గీ:-
ఈ విరాట్టుకుముఖమును,ఇరు భుజములు,
రెండు తొడలును పాదముల్ రెండు.చెప్పఁ
బడెను. ముఖమాయె చక్కన బ్రాహ్మణుండు.
క్షత్రియుఁడయె భుజములుగ. సత్ర మహిమ. 5.

వివరణ:-
ఆ యజ్ఞము నుండి గుఱ్ఱములును, గర్దభాదులును, గోవులును, మేఁకలును, గొఱ్ఱెలును పుట్టెను.  బ్రహ్మ వేత్తలు బ్రాహ్మణాది సృష్టిని గూర్చి ప్రశంసించి యెప్పుడు ప్రజాపతి ప్రాణేంద్రియ రూపులగు దేవతలు విరాట్టునాకారమును సంకల్పముచేఁ బుట్టించిరో అప్పు డన్ని ప్రకారములుగా విషయమును కల్పించిరి. ముఖము మొదలైనవి ఏవి యని యడుగఁగా ఈ రూపునకు బ్రాహ్మణుడు ముఖము, క్షత్రియుఁడు భుజము.
ఇది 5 వ భాగము. (స శేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.