గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఆగస్టు 2014, బుధవారం

షోడశాబ్దాత్పరం పుత్రం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. షోడశాబ్దాత్పరం పుత్రం,ద్వాదశాబ్దాత్పరం స్త్రియం
న తాడయే దుష్టవాక్యైః, పీడయే న్న స్నుషాదికమ్. 
గీ. పదియునారేండ్లు పైపడ్డ మృదుల సుతుని, 
పదియు రెండేండ్లు పైబడ్డ మధుర సుతను 
గౌరవంబుగ చూచుచు ఘనతఁ గనుఁడు. 
కోడలిని గను సుత వోలె. కులము మెచ్చ.
భావము. పదహారు సంవత్సరాల వయసున్న కుమారుని, పన్నెండు సంవత్సరాల కుమార్తెను దుష్టభాషణలతో దండింపకూడదు. కోడళ్ళు మొదలైనవారిని పీడింపరాదు. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.