గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జనవరి 2022, మంగళవారం

పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.గరికిపాటి నరసింహారావు మహా సహస్రావధానిగారికి అభినందనలు.

 

జైశ్రీరామ్.
పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.గరికిపాటి నరసింహారావు మహా సహస్రావధానిగారికి అభినందనలు.

ఆనందామృత మొల్కునట్టి నగవుల్, హాస్యప్రసంగాంచితం
బౌనానందముఖారవిందమహితుండౌ నారసింహాఖ్యుఁడే
తా నాసందమనోజ్ణుఁడై తనర.పద్మశ్రీపురస్కారమున్,
జ్ణానోద్భాసితుడై గ్రహించెను శుభాకాంక్షల్ నృసింహా! సుధీ!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.