గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జూన్ 2014, గురువారం

నిజ సౌఖ్యం నిరుంధానో యో ధనార్జన మిచ్ఛతి...మేలిమి బంగారం మన సంస్కృతి, 222.

జైశ్రీరామ్.
శ్లో. నిజ సౌఖ్యం నిరుంధానో యో ధనార్జన మిచ్ఛతి
పరార్థం భారవాహీవ క్లేశస్యైవ హి భాజనమ్.

ధనమును సంపాదించుచు 
తనకొఱకది వాడుకొనక దాచుచుచునుండున్ 
తనవారి కొఱకు నెవ్వఁడు 
తనసుఖమును వీడు నతఁడు. తనదుఃఖమదే.
భావము. తన సుఖాన్ని కాదనుకొని , ఎవడు ధనాన్ని సంపాదించాలనుకుంటాడో , వాడు - పరులకోసమే బరువులు మోసేవాడై కేవలం దుఃఖపాత్రుడౌతాడు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందుకే అంటారు తనకు మాలిన ధర్మం పనికి రాదని రక్తం ధారపోసినా దాహం తీరదు తృప్తి ఉండదు ముఖ్యంగా ఈ రోజుల్లో లోకం తీరే అంత .బాగుంది ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.