గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, డిసెంబర్ 2009, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 73.

మహోదయులారా!
సామాన్యులకు, మాన్యులకు గల భేదం ఒక చిన్న శ్లోకం వ్యక్తం చేస్తోంది. గమనించండి.
శ్లో:-
అయం నిజ:? పరో?వేతి గణనా లఘు చేతసామ్.
ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్.
క:-
నావారా? పైవారా?
ఏవార?లటంచు హీను లెంతురు ప్రజలన్.
భూవలయ సంస్థిత ప్రజ
నావారని తలతు రెపుడు నయత నుదారుల్.
భావము:-
ఎదుటి వారిని వీరు నాకు సంబంధించిన వారా? లేక పై వాళ్ళకు సంబంధించిన వారా/ అనేటువంటి హీనులకే ఉండును. విశాలమైన హృదయము కలవారలకు ఏ భూమిపై గల జనులందరు ఒకే కుటుంబము అనే భావనే ఉండును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.