గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, డిసెంబర్ 2009, ఆదివారం

చెప్పుకోండి చూద్దాం 32 కు నా వివరణ.

శ్రీమ దాంధ్రామృ తాస్వాదనా లోలులారా!
దీనికి ముందు టపాలో "చెప్పుకోండి చూద్దాం 32" కు శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారు కామెంట్ ద్వారా చక్కని వివరణను కొంత వరకు ఇచ్చి యున్నారు. నాకు తోచిన వివరణను మీముం దుంచుతున్నాను. దోషము లుండకపోవు. కంటఁ బడితే మాత్రం వెంటఁ బడి మరీ చెప్పి, సరిచేయండి.
ఇక పరిశీలించండి.


తే:-
అతివ కచ నాభి జఘన దేహాననము " త
మీనదరసాలతారాజపా " నిరాక
రణ మనంతమనాది నేత్ర గళ భుజ న
ఖోష్ఠ కుచ వచో దంతంబు లుభయ గతుల.
భావము:-
1:-
అతివ యొక్క
-- కచ ----- నాభి ------ జఘన ------ దేహ --------ఆననము లతో
-- తమీ ---- నద ------- రసా---------లతా -------- రాజ.
-- చీకటి. --- సుడి ------ భూమి ------ లత ---------చంద్రుడు. సరి పోలును.
నిరాకరణ మనంత = అంతమందలి "పా" విడిచిపెట్ట వలెను.


2:-
అనాది = ఆది అక్షరమైన "త" విడిచి పెట్టినచో.
---నేత్ర ---- గళ -------- భుజ ------- నఖ ----------ఓష్ఠ ములతో
---మీన----దర---------సాల---------తారా----------జపా
---చేప. --- శంఖము.----ప్రాకారము---నక్షత్రములు.-- మంకెనపువ్వు.
సరి పోలును.


3:-
కుచ వచో దంతము లుభయ గతులు = ఆద్యంత్యాక్షరములను తొలగించి అనగా ఆద్యక్షరము "త". అంత్యాక్షరము"పా". అను రెండిటినీ విడిచిపెట్టి చూడఁ దగును


--- కుచ --------------- వచో ------------------------ దంతము లకు
---మీనద---------------రసాల-----------------------తారా
---కుంభములు(?)------తీయ మామిడి రసము--------నక్షత్రములు
సరిపోలును.


అని నే నూహిస్తున్నాను. ఇంతకన్నా యుక్తమైన సమన్వయం మీకు తోచినచో తప్పక తెలుపఁ గలరని ఆశిస్తున్నాను.


జైహింద్..
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.