గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2008, బుధవారం

ఔచిత్య విచక్షణాధికారం మీదే.

ఈ శ్లోకంలోని కవి భావన ఏమైయుంటుంది?

శ్లోకము:-
కేశవం పతితం దృష్ట్వా
భీమం చైవ గతాయుషం
రుదంతి కౌరవాః సర్వే
పాండవాః హర్ష మాయుః.

ఈ శ్లోకం చదివేరు కదా ఏమైనా ఔచిత్య యుక్తంగా వుందా యీ శ్లోకం?
కేశవుడు పతితమైపోవడం చూచిన భీముడు గతాయుషు డయేడట. కౌరవులు ఏడుస్తున్నారట. పాండవులు సంతోషించారట.

ఈ శ్లోకంలో అనౌచిత్యం లేదనుకుంటే కామెంట్ పంపడం ద్వారా మీ వ్యాఖ్య పాఠకులమనో ఫలకాలపై ముద్రితమయేలాగ చేయ వలసినదిగా నా కోరిక.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.