గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2024, ఆదివారం

మామను సంహరించి, యొక మామకు గర్వమడంచి .. ప్రాచీన తెలుఁగు కవుల రచనలు Part 2.

జైశ్రీరామ్
చం.  మామను సంహరించి, యొక మామకు గర్వమడంచి, యన్నిశా 
మామను రాజుచేసి, యొకమామ తనుజునకాత్మ బంధువై 
మామకు గన్నులిచ్చి, సుతు మన్మథ పత్నికి తానే మామయై, 
మామకు మామయైన P పరమాత్ముడు మాకు ప్రసన్నండయ్యైన్ ||
మామను సంహరించి,
విష్ణువు అవతారాలలో ఒకటైన కృష్ణుని కంసుడనే మామను సంహరించినాడు కదా!
యొకమామకు గర్వమడంచి
విష్ణుమూర్తికి సముద్రుడు మామ, రామావతారంలో సముద్రుడనే మామకు గర్వం భంగం చేస్తాడు కదా!
యాన్నిశా మామను రాజు చేసి,
యా నిషా, అంటే రాత్రికి, మామ అనే శబ్దమునకు చంద్రుడు కూడా వస్తాడు, ( చందమామ) పార్వతీదేవి శాపం వలన క్షీణుడైన చంద్రున్ని రాత్రికి రాజు ని చేస్తాడు
యొకమామ తనుజునకు ఆత్మ బంధువై,
అర్జునుడు కృష్ణుని కి ఆత్మ బంధువు, అర్జునుని తండ్రి వీరికి మామయ్య కదా!
మామకు గన్నులిచ్చి
రాయబారం లో ధృతరాష్ట్రునికి కన్నులు ప్రసాదిస్తారు శ్రీకృష్ణుల వారు,,
సుతు మన్మధ పత్నికి తానే మామయై, కృష్ణుని కుమారుడే కదా మన్మధుడు, ఆ మన్మధుని పత్ని రతీదేవి, రతీదేవికి వీరు మామే కదా!
మామకు మామయైన పరమాత్ముడు మాకు ప్రసన్నుడయ్యెన్
విష్ణుమూర్తికి సముద్రుడు మామ, లక్ష్మీదేవి సముద్రుని కూతురు గనుక, అయితే (మధ్యగంగ) విష్ణుమూర్తి పాదముల నుండి ఉద్భవించినది, అన్ని నదులు సముద్రంలోనే సంగమిస్తాయి కదా!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.